Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సునీల్ ఫ్యాషన్ డిజైనర్ కాదు...అంతా ఉత్తిత్తే...!?
ప్రముఖ దర్శకుడు వంశీ తన సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైనర్ 'లేడీస్ టైలర్" ని రీమేక్ చేస్తున్నారంటూ ఇటీవల వార్తలు వెలువడ్డాయి. అప్పటి రాజేంద్ర ప్రసాద్ పాత్రను అల్లరి నరేష్ లేదా సునీల్ చేస్తారని పుకార్లు షికారు చేశాయి. ఈ ఊహాగానాల నేపధ్యంలో డైరెక్టర్ వంశీ క్లారిటీ ఇచ్చారు. 'లేడీస్ టైలర్" సీక్వేన్స్ వర్క్ జరుగుతుంది. ఐతే ఈ సినిమాలో లీడ్ రోల్ ఎవరు చేస్తారన్నది ఇంకా ఖరారు కాలేదు. దీనికి సంబంధించి నరేష్, సునీల్ ల కాల్ షీట్స్ కూడా నాదగ్గర లేవని వంశీ చెప్పారు.
అయితే, లేడీస్ టైలర్ సీక్వేన్స్ గా 'ఫ్యాషన్ డిజైనర్, సన్నాఫ్ లేడీస్ టైలర్" పేరుతో చిత్రం చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాదిలో పని ప్రారంభం అవుతుందని చెప్పారు. ఒక ప్రధాన నటుడు ఈ చిత్రం చేస్తారని వంశీ వెల్లడించారు. రాబోయే నెలల్లో ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రముఖ దర్శకుని ప్రాజెక్ట్ లో ఎవరు చేస్తారన్నది వేచిచూడాల్సిందే..