Don't Miss!
- Sports IPL 2024: లైట్ తీస్కో హార్దిక్.. రోహిత్ కూడా టైటిల్ గెలవలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
చిరంజీవి క్లాప్ తో సునీల్ కొత్త చిత్రం ఓపెనైంది
పూల రంగడుతో సూపర్ హిట్ ని కైవసం చేసుకున్న సునీల్ మరో చిత్రం మొదలైంది. ఆడుతూ పాడుతూ,బ్లేడు బాబ్డీ వంటి కామెడీ చిత్రాల దర్శకుడు దేవిప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఈ రోజే(శుక్రవారం)రామానాయుడులో ఓపినైంది. చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరైన ఈ పంక్షన్ కి సినీ పరిశ్రమలోని అతిరధులు హాజరయ్య శుభాకాంక్షలు తెలియచేసారు.
ఇషాఛావ్లా హీరోయిన్ గా ఈ చిత్రంలో చేస్తోంది. బాలీవుడ్లో మాధవన్, కంగనారనౌత్ జంటగా నటించిన 'తను వెడ్స్ మను' చిత్రం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. మెగా సూపర్గుడ్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రానికి 'సీతా వెడ్స్ రాముడు' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారని సమాచారం. ఇక కమెడియన్ గా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సునీల్ ఆ తర్వాత అందాల రాముడు చిత్రం ద్వారా హీరోగా టర్న్ అయి మర్యాద రామన్న చిత్రం ద్వారా హీరోగా నిలదొక్కుకున్నాడు.
తాజాగా విడుదలైన పూలరంగడు మంచి విజయం సాధించడం సునీల్ కు మరింత ఊపునిచ్చింది. పలువురు దర్శకులు, నిర్మాతలు ఆయనతో సినిమా చేయడానికి పోటీ పడుతున్నారు. ఈ సినిమాతో మరో సారి ఘన విజయం సునీల్ సాధిస్తాడని ధట్స్ తెలుగు ఆసిస్తూ శుబాకాంక్షలు తెలియచేస్తోంది.