Don't Miss!
- News షర్మిలపై జగన్ కామెంట్స్ ! చంద్రబాబు కౌంటర్-సజ్జల ఎన్ కౌంటర్..!
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గూండాల నుంచి సునీల్ ని నాగచైతన్య రక్షించి...
చిత్తూరు: బురకాయలకోట సమీపంలో సాయిగణేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రంలో శనివారం ఫైట్ సీన్స్ ను చిత్రీకరించారు. ఈ చిత్రంలో ఎస్సై సునీల్.... హీరో నాగచైతన్య అన్నగా నటిస్తున్నారు. విలన్ అనుచరులు ఎస్సై సునీల్పై దాడి చేయడం, ఆయన్ను వెంబడిస్తూ రైలు వెనుక వెంటాడటం వంటి దృశ్యాలను చిత్రీకరించారు.
తరుముతున్న గూండాల నుంచి తమ్ముడూ కాపాడమంటూ సునీల్ అరుస్తూ రావడం, గూండాలతో నాగచైతన్య పోరాటం చేయడం వంటి దృశ్యాలను చిత్రీకరించారు. చిత్రీకరణ తిలకించేందుకు చుట్టు పక్కల మండలాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. చిత్రీకరణలో సహ నిర్మాత ప్రసాద్ మెయినేని, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మేనేజరు శేషాద్రిరాజు తదితరులు పాల్గొన్నారు.
వివరాల్లోకి వెళితే... బురకాయలకోట సమీపంలోని మద్దినాయునిపల్లెకు వెళ్లే రోడ్డు రైల్వేగేటు వద్ద శనివారం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. తమిళంలో తీసిన వేటయ్ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత బెల్లంకొండ సురేష్, దర్శకుడు కిషోర్కుమార్ కాగా, హీరోలుగా అక్కినేని నాగచైతన్య, సునీల్, హీరోయిన్లుగా తమన్నా, ఆండ్రియా నటిస్తున్నారు.
గూడ్సులో స్మగ్లింగ్ చేస్తున్న గంజాయిని పట్టుకున్న ఎస్ఐ సునీల్ గంజాయినీ పోలీస్స్టేషన్కు తరలిస్తుండగా, ఎస్ఐపై రౌడీలు దాడి చేస్తారు. విషయం తెలుసుకున్న హీరో నాగచైతన్య అక్కడికి చేరుకుని రౌడీలతో ఫైట్చేసి సునీల్ను కాపాడి, గంజాయిని పోలీస్స్టేషన్కు తరలించే సన్నివేశాలను చిత్రికరించారు.
ఇక వెట్టై చిత్రం యాక్షన్, ప్రేమ, సెంటిమెంట్ సమాహారంతో రూపొందింది. తెలుగు వెర్షన్ లో మిగతా కీలక పాత్రల్లో... బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అశుతోష్ రాణా, నాగినీడు, ఆహుతిప్రసాద్, జయప్రకాష్రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మూలకథ: లింగుస్వామి, మాటలు, స్క్రీన్ప్లే: ఎ.దీపక్రాజ్, పాటలు: చంద్రబోస్, సంగీతం: తమన్.