Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సునీల్ 'పూల రంగడు'కి అవే ప్లస్ అని తేల్చారు
'పూల రంగడు' చిత్ర విజయానికి సునీల్ సిక్స్ప్యాక్, అనూప్ సంగీతం బాగా ప్లస్ అయ్యాయి అంటున్నారు నిర్మాత అచ్చిరెడ్డి. సునీల్ హీరోగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై వీరభద్రమ్ దర్శకత్వంలో నిర్మాత కె.అచ్చిరెడ్డి నిర్మించిన 'పూల రంగడు' చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే... 'ప్రేమ కావాలి' తరువాత మా బేనరులో రూపుదిద్దుకున్న 'పూలరంగడు' కూడా విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్ర విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికీ, ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు. శనివారంతో దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకుంటోంది అన్నారు. ఇక ఈ చిత్రం రిలీజైన రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సునీల్ డాన్స్ లు,సిక్స్ ప్యాక్ సినిమాకు ప్లస్ అయ్యి నిలిచాయి. ప్రేక్షకుడికి కామెడీతో పాటు ఈ రెండు అంశాలు ఆసక్తిని కలిగించాయి.
ఇక ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన 'బిజినెస్మేన్' చిత్రం సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించింది. అలాగే ఆ సంస్థ సమర్పణలో రూపుదిద్దుకున్న 'పూల రంగడు' సినిమా మహాశివరాత్రి సందర్భంగా విడుదలై విజయవంతమైంది. అహనా పెళ్లంట చిత్రంతో పరిచయమైన దర్శకుడు వీరభద్రమ్ కి ఇది రెండో చిత్రం. ఈ చిత్రం విజయంతో వీరభద్రమ్ పెద్ద డైరక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు. యాక్షన్,ఎంటర్టైన్మెంట్ ని కలిపి బాగా డీల్ చెయ్యగలడని పేరు తెచ్చుకున్నాడు.
ఈ చిత్రం అనంతరం సునీల్.. వెంటనే దేవిప్రసాద్ దర్శకత్వంలో తను వెడ్స్ మనూ చిత్రం రీమేక్ ఒప్పుకున్నారు. ఇషాఛావ్లా హీరోయిన్ గా చేసే ఆ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు నిర్మిస్తున్నారు. వారి రచ్చ చిత్రం రీసెంట్ గా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అలాగే సునీల్ ..సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఉదయ్ శంకర్ దర్శకత్వంలో మరో చిత్రం కమిటయ్యారు.