Don't Miss!
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Lifestyle రాత్రిపూట అలర్జీలు పెరుగుతున్నాయా? ఈ నియమాలు పాటిస్తే నిద్ర తేలికగా వస్తుంది
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
రేడియో జాకీగా గాయత్రి టీనేజ్ గర్ల్ ప్రేమకథ
ఒక టీనేజ్ గాళ్ ప్రేమకథ ఇది అని దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి అన్నారు. ఇందులో హీరోయిన్ ఓ రేడియో జాకీ అని, కథాకథనాలు హార్ట్ టచింగ్గానూ రోమాంటిక్ ఫీల్తోనూ ఉంటాయని ఆయన అన్నారు. కొత్త, పాత తారలు ఇందులో నటిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిందని సునీల్ కుమార్ రెడ్డి చెప్పారు.
తమ శ్రావ్య ఫిలింస్ సంస్థలో ఇది తొమ్మిదో సినిమా అని, టైటిల్ త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత యక్కల రవీంద్రబాబు చెప్పారు. సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉంటాయి. ప్రవీణ్ ఇమ్మడి స్వరాలందిస్తున్ారు. ఫిబ్రవరిలో పాటలను, చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రఘుబాబు, ఎల్బీ శ్రీరామ్, షఫీ, జీవా, వైభవ్ సూర్య, సోనీ చరిష్టా, అనిల్ కళ్యాణ్, ఎఫ్ఎం బాబాయ్, శశిధర్, రవి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా సాయి జేమ్స్, ఎడిటింగ్ శివ, పాటలు- శ్రేష్ఠ, ఆర్ట్ మౌళి. ఈ చిత్రాన్ని సుఖీభవ గ్రూప్ సమర్పిస్తోంది. డిజిక్వెస్ట్ బసిరెడ్డి, బి. బాపిరాజు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.