'తను వెడ్స్ మనూ' తెలుగు రీమేక్ హీరో ఎవరంటే...
మాధవన్, కంగనా రౌనత్ కాంబినేషన్ లో రూపొందిన హిందీ చిత్రం 'తను వెడ్స్ మనూ' తెలుగులో రీమేక్ కి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంకి సునీల్ ని హీరోగా ఫైనలైజ్ చేసినట్లు తాజా సమాచారం. క్రితం శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జిలు కొత్తగా ఓ సంస్ధను ప్రారంభించి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచనలో వున్నారు. ప్రస్తుతం ఈ రీమేక్ రైట్స్ కోసం హిందీ నిర్మాతను సంప్రదించినట్లు తెలుస్తోంది. అలా మొదలైంది విజయం సాధించటంతో అటువంటి రొమాంటిక్ కామిడీలకు గిరాకీ ఉంటుందనే ఆశతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











