Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రేడియా జాకీ పై మనస్సు పడ్డ సునీల్
ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ నిత్యం ప్రజలకు ఆనందోత్సాహాలను పంచడంలో ఎఫ్ఎం రేడియోలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయన్నారు. ప్రయాణంలో అలసట చెందినపుడు వాహనంలో ఎఫ్ఎం వింటే ఉపశమనం కలగడంతో పాటు ఒత్తిడి తగ్గుతుందన్నారు. సంస్థ ప్రాంతీయ ప్రోగ్రామింగ్ హెడ్ రేవతి మాట్లాడుతూ ఈ ఎంపికలకు నగరవ్యాప్తంగా నాలుగు వేలమంది యువతీయువకులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. అందులో 14 మంది తుది పోరులో నిలిచినట్లు తెలిపారు. చివరగా ముగ్గురిని ఎంపిక చేశామన్నారు.
ఇక కమిడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ ఈ మధ్యనే మరో కొత్త చిత్రం కమిటయ్యారు. రీసెంట్ గా రిలీజై బూతు చిత్రం అని పేరు తెచ్చుకున్న 'బస్స్టాప్' ఫేమ్ మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. గీతా ఆర్ట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు మారుతి మీడియాకు ఖరారు చేసారు. ఆయన మాట్లాడుతూ..''గీతా ఆర్ట్స్ పతాకంపై ఓ సినిమా రూపొందిస్తున్నాం. అందులో సునీల్ హీరోగా నటించే అవకాశాలున్నాయి''అన్నారు.
సునీల్ హీరోగా 'అందాల రాముడు' చిత్రాన్ని రూపొందించిన మెగా సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ తాజాగా హిందీలో హిట్టయిన 'తను వెడ్స్ మను'ను చిత్రాన్ని సునీల్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దేవిప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్త అయింది. ఈ చిత్రానికి 'మిస్టర్ పెళ్లి కొడుకు' అనే టైటిల్ ఖరారు చేసారు. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బేనర్లో వస్తున్న 11వ చిత్రం ఇది.