twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్లాప్ దర్శకుడితో 'సింగర్ సునీత' !!

    By Staff
    |

    'ఈ వేళలో నీవు ఏం చేస్తువుంటావు' పాటతో ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించిన స్వరమాధురి సునీత. ఆ పై తనదైన మెలోడి స్వరంతో ఎన్నో పాటలు పాడి అందరి అభిమానాన్ని చూరగొంది. ఈ మధ్యన బుల్లితెర పై 'సరిగమప', 'ఝుమ్మందినాదం' వంటి సంగీత నేపథ్య కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించిన సునీత, ఇప్పుడు నిర్మాతగా కొత్త అవతారం ఎత్తబోతోంది.

    'ఓయ్' చిత్ర దర్శకుడు ఆనంద్ రంగా తో కలిసి సంయుక్తంగా నిర్మించబోయే ఈ చిత్రానికి రాజ్ పిప్పాల దర్శకత్వం వహించబోతున్నారు. రాజ్ 'బోణి' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైనాడు. సుమంత్, కృతి జంటగా వచ్చిన ఈ చిత్రంతో బోణి చెయ్యలేకపోయిన రాజ్ కనీసం ఈ చిత్రంతో నైనా హిట్ ఇస్తాడో లేదో చూడాలి. నటీనటులు మరియు ఇతర వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X