మీడియాలో న్యూడ్ ఫోటోలు హల్ చల్, హీరోయిన్ ఖండన!
ముంబై: బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ ఇటీవల ముంబై-పూణె హైవేలో జరిగిన ఓ పార్టీలో నగ్నంగా అందాల విందు చేసిదంటూ కొన్ని న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. డైమండ్ ట్రేడర్ అనే సంస్థ ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే తాను పార్టీలో నగ్నంగా చేయలేదని, తనపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని సన్నీ లియోన్ అంటోంది.
ఈ వార్తలపై సన్నీ లియోన్ తన ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. తనను బాధించడానికే ఈ వార్తలకు ప్రచారంలోకి తెచ్చారని ఆమె పండి పడ్డారు. 'నన్ను బాధ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. కానీ నేను అందుకు సిద్ధంగా లేను. నన్ను తోసేయడానికి ప్రయత్నించినా నా కాళ్లపై నేను బలంగా నిలబడగలను. మీరు అబ్దాలు చెబుతున్నారు. కానీ నిజం ఏమిటో నాకు తెలుసు. మై హార్ట్ ఈజ్ క్లియర్' అంటూ ట్వీట్ చేసింది.

'నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వార్తలు సృష్టించడం వల్ల వారు ఏమి ఆశిస్తున్నారో తెలియదు. నిజం నిలకడమీద తేలుతుంది. కానీ మీలాంటి వారి వల్ల మాత్రం నేను ఎప్పటికీ పడిపోను' అంటూ సన్నీ లియోన్ ట్వీట్ చేసింది. ఆమె స్పందన చూస్తుంటే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని ఆమె ముందే సిద్దమైనట్లు కనిపిస్తోంది.
కాగా....ముంబై-పూణే హైవేలో జరిగిన ప్రైవేట్ పార్టీలో పాల్గొన్నందుకుగాను సన్నీ లియోన్ రూ. 40 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వీడియో కూడా యూట్యూబులో ఉంది. అయితే దాన్ని వెంటనే డిలీట్ చేసారు. పోర్న్ స్టార్ అయిన సన్నీకి ఇలాంటి న్యూడ్ సంఘటనలు కొత్తేమీ కాదు. అయితే ఇండియన్ ఎంటర్టెన్మెంట్స్ రంగంలో అడుగు పెట్టిన తర్వాత సన్నీ లియోన్ అలాంటి వాటికి దూరంగా ఉంటూ వస్తోంది. అయితే ఇంతలోనే ఈ న్యూడ్ చిత్రాలు ప్రచారంలోకి రావడం చర్చనీయాంశం అయింది.
'బిగ్ బాస్ 5' రియాల్టీ షో ద్వారా సన్నీ లియోన్ ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టింది. అనంతరం పూజా భట్ దర్శకత్వంలో వచ్చిన 'జిస్మ్ 2' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఇటీవల నటించిన 'రాగిణి ఎంఎంఎస్ 2' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధించింది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు బాలీవుడ్ చిత్రాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











