Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
తెరపై నిజ జీవిత పాత్రలో సన్ని లియోన్
ముంబై : బాలీవుడ్లో విడుదలై సంచలన విజయం సాధించిన 'రాగిణి ఎంఎంఎస్'కి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రధాన పాత్రకు సన్నీ లియోన్ని ఎంపిక చేసుకొన్నారు. సన్నిలియోన్ ని ఎంపిక చేసుకోవటంతో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు సన్నిలియోన్ ఈ చిత్రంలో బాలీవుడ్ నటిగా కనిపించనున్నట్లు నిర్మాతలు రివిల్ తెలుస్తోంది. దాదాపు వారం రోజుల క్రితం ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. సిద్ది వినాయిక టెంపుల్ వద్ద పూజతో ఈ చిత్రం షూటింగ్ మొదలైంది.
'రాగిణి ఎంఎంఎస్' చిత్రం బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లు రాబట్టుకొంది. నిర్మాణ వ్యయం కంటే దాదాపు తొమ్మిది రెట్లు అధికంగా వసూళ్లను సాధించింది. బాలాజీ మోషన్ పిక్చర్స్ పతాకంపై జితేంద్ర, శోభాకపూర్ నిర్మించారు. తాజాగా 'రాగిణి ఎంఎంఎస్'కి కొనసాగింపును రూపొందించబోతున్నారు. ఈ చిత్రం కు అప్పడే బిజినెస్ సర్కిల్స్ లో మంచి క్రేజ్ క్రియోట్ అయ్యింది.
'జిస్మ్-2'తో బాలీవుడ్కి పరిచయం అయిన కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ . ఈమె అమెరికాలో నీలి చిత్రాల్లో నటించింది. పూజా భట్ దర్శకత్వంలో రూపొందిన 'జిస్మ్-2'తో ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దాంతో ఆమె చుట్టూ దర్శక,నిర్మాతలు తిరగటం మొదలెట్టారు. అయితే ఆమె ఆచితూచి అడుగులు వేస్తోంది. రామ్ గోపాల్ వర్మ వంటి దర్సకుడుకి సైతం డేట్స్ ఇవ్వని ఆమె తాజాగా మరో చిత్రం కమిటైంది. ఏక్తాకపూర్ నిర్మిచనున్న కొత్త చిత్రంలో ఆమెను ఎంపిక చేసారు. ఈ విషయం అఫీషియల్ గా మీడియాకు బాలాజీ మోషన్ పిక్చర్స్ సీఈఓ తనుజ్ గార్గ్ వెల్లడించారు.
ఇక ఏక్తా కపూర్ పూర్తిగా సన్నిలియోన్ పొటిన్షియాలిటినీ వినియోగించుకుంటానని చెప్తోంది. తమ వద్ద నున్న స్క్రిప్టు చాలా బాగా వచ్చిందని,తమ కథకు కరెక్టుగా సన్నిలియోన్ ఏప్ట్ అవుతుందని చెప్తోంది. అయితే ఎంత సన్నిలియోన్ ని పెట్టుకున్నా కథ,కథనం సరిగ్గా లేకపోతే సినిమాలు ఆడవని జిస్మ్ 2 ప్రూవ్ చేసింది కాబట్టి జాగ్రత్తగా దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తారని ముంబై వర్గాలు అంటున్నాయి.