బూతు ఇమేజ్ నుండి బయటపడాలని హీరోయిన్ తాపత్రయం
హైదరాబాద్: ఇండో-కెనడియన్ పోర్న్ స్టార్ సన్నీ లియోన్.....బూతు సినిమాల్లో నటించడం మానేసి ఇండియన్ ఎంటర్టెన్మెంట్స్ రంగంలో అడుగు పెట్టి బాలీవుడ్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తన తాజా మూవీ 'రాగిణి ఎంఎంఎస్ 2' ప్రమోషన్లలో బిజీగా గడుపుతోంది.
పోర్న్ సినిమాలను వదిలేసి 'జిస్మ్ 2' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది సన్నీ లియోన్. రాగిణి ఎంఎంఎస్ 2 ప్రెస్ మీట్ సందర్భంగా వన్ ఇండియా రిపోర్టర్ సోనాక్షి మిశ్రాతో సన్నీ లియోన్ మాట్లాడుతూ....పోర్న్ ఇమేజ్ మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానని, నా పట్ల ప్రజల అభిప్రాయం మారాలని కోరుకుంటున్నాను, అందుకు కొంత సమయం పడుతుందని అన్నారు.
నా గత జీవితం తాలుకు ఛాయల నుండి బయట పడటం అంత ఈజీ కాదని నాకూ తెలుసు. దానికి చాలా సమయం పడుతుంది. సహనం కూడా అవసరం. అందుకు తగిన కార్యాచరణతో ముందుకు సాగుతున్నాను అని సన్నీ లియోన్ చెప్పుకొచ్చింది. వీలైనంత తర్వగా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను అన్నారు.
సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...సన్నీ లియోన్ నటిస్తున్న 'రాగిణి ఎంఎంఎస్ 2' సినిమా అంటే.....అందాల ఆరబోత ఓ రేంజిలో ఉంటుందనే అంచనాలతో ఉంటారు శృంగార ప్రియులు. ఇలాంటి అంచనాలతో వచ్చే ప్రేక్షకులను నిరుత్సాహ పరచకుండా సినిమాలో అందుకు తగిన విధంగా హాట్ సీన్లు ప్లాన్ చేసారు దర్శక నిర్మాతలు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్లు, పోస్టర్లు సినిమాలో హారర్ డోసుతో పాటు గ్లామర్ డోసు కూడా బాగానే ఉందని స్పష్టమవుతోంది. తాజాగా నిర్మాతలు 'రాగిణి ఎంఎంఎస్ 2' చిత్రానికి సంబంధించిన మరో పోస్టర్ విడుదల చేసారు. ఇందులో హీరోయిన్ సన్నీ లియోన్ ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా నగ్నంగా ఉండటం శృంగార ప్రియుల్లో సినిమాపై అంచనాలు మరింత పెంచేలా చేసింది.
ఇలాంటి పోస్టర్లు రిలీజ్ చేయడం వల్ల సినిమాకు ఓపెనింగ్స్ బాగా వస్తాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు. ఏది ఏమైనా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న లేడీ నిర్మాత ఏక్తా కపూర్ శృంగార ప్రియుల టేస్ట్ ఎలా ఉంటుందో పర్ఫెక్టుగా ఊహించినట్లుంది. బాలాజీ మోషన్స్ పిక్చర్స్, ఎఎల్టి ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్లపై ఏక్తా కపూర్, శోభా కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
హారర్ అండ్ సెక్స్ మిక్స్తో కూడిన 'రాగిణి ఎంఎంస్' చిత్రం విజయవంతం కావడంతో దానికి సీక్వెల్గా 'రాగిణి ఎంఎంఎస్ 2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈచిత్రానికి భూషణ్ పటేల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసారు. ఇక్కడ గమనించ వలసిన విషయం ఏమిటంటే.....ఈ ట్రైలర్ను పెద్దలకు మాత్రమే పరితమైన కొన్ని బూతు వెబ్ సైట్లలో కూడా విడుదల చేసారు. మార్చి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇప్పుడు సన్నీపై ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించారు. ఈ పాట సినిమా ప్రమోషన్కి బాగా ఉపకరిస్తుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications












