Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Mahesh Babu: తల్లి అస్థికలతో మహేష్ బాబు.. కంటతడి పెట్టిస్తున్న మరో ఫొటో!
ఇటీవల ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ సతీమణి మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మృతితో ఘట్టమనేని ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొన్ని నెలల క్రితమే మహేష్ బాబు తన సోదరుడు రమేష్ బాబును కోల్పోయాడు. ఇక ఇప్పుడు ఎంతగానో ఇష్టపడే తల్లి కూడా తనువు చాలించడంతో మహేష్ బాబు ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లిపోయాడు. ఇక ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలను కూడా మహేష్ బాబు ప్రత్యేకంగా దగ్గరుండి పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు తల్లి ఆస్తికలతో కనిపించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తల్లితో మహేష్ అనుబంధం
సూపర్ స్టార్ మహేష్ బాబు తన తల్లి గురించి చాలా ఇంటర్వ్యూలలో ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు. ఎన్ని టెన్షన్లు ఉన్నా కూడా అమ్మ చేతి కాఫీ తాగితే ఆ టెన్షన్స్ అన్నీ కూడా తీరిపోతాయి అని చాలా ఇంటర్వ్యూలలో తెలియజేశాడు. ఎప్పుడు కాస్త అసంతృప్తిగా అనిపించినా కూడా తల్లి దగ్గరికి వెళ్ళిపోతాను అని ఇప్పటికి కూడా అదే అలవాటు ఉంది అని మహేష్ బాబు వివరణ ఇచ్చాడు.
తీరని శోకం..
తల్లి కంటే గొప్పవారు మరొకరు ఉండరు అని ఎంతగానో తల్లిని ప్రార్థించే మహేష్ బాబుకు ఇప్పుడు తీరని శోకం మిగిలింది. హఠాత్తుగా ఆమెను కోల్పోవడంతో శోకసంద్రంలో మునిగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి మహేష్ బాబుకు చాలా సమయం పడుతుంది అని అర్థమవుతుంది. అయితే ఇదే తరుణంలో మహేష్ బాబు హిందూ ఆచారాల ప్రకారం అంత్యక్రియల్లో పాల్గొని ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలను కూడా ఒక కొడుకుగా బాధ్యతతో నిర్వహిస్తున్నాడు.
తల్లి అస్థికలతో మహేష్
ఇక మహేష్ బాబు ఇటీవల తల్లి అస్థికలతో కనిపించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తల్లి ఇందిరా దేవి అస్థికలతో గంగలో కలపడానికి మహేష్ బాబు ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి హరిద్వార్ వెళ్లారు. ఇటీవల తన స్వగృహం వద్దనే చిన్న కర్మ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ బాబు ఇప్పుడు అస్థికలను గంగలో కలిపేందుకు ప్రత్యేకంగా హరిద్వార్ కు వెళ్లారు.
కుటుంబ సబ్యులతో కలిసి
బేగంపేట్ నుంచి మహేష్ బాబు స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ లోనే తన కుటుంబ సభ్యులతో కలిసి హరిద్వార్ వెళ్ళినట్లుగా తెలుస్తోంది. మరి కొంతమంది కుటుంబ సభ్యులు ముందుగానే ప్రత్యేకంగా అక్కడికి చేరుకోగా సోమవారం రోజు మహేష్ బాబు తన బాబాయ్ శేషగిరిరావు అలాగే జయదేవ్ సుధీర్ బాబులతో కలిసి ప్రత్యేకంగా హరిద్వార్ వెళ్లారు. మహేష్ అక్కడ తన తల్లి అస్థికలను గంగలో కలిపినట్లుగా తెలుస్తోంది.
షూటింగ్ ఇప్పట్లో లేనట్లే..
ఇక తల్లి మృతి చెందడంతో మహేష్ బాబు ప్రస్తుతం సినిమాకు సంబంధించిన విషయాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు అని తెలుస్తోంది. ఇదివరకే సినిమా షూటింగ్ మొదలు పెట్టిన మహేష్ బాబు తల్లి మృతి చెందడంతో ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన చర్చల్లో పాల్గొనడం లేదు. పూర్తి స్థాయిలో మహేష్ బాబు ఆ బాధ నుంచి కోలుకున్న తర్వాతనే షూటింగ్ మొదలుపెట్టాలి అని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.