Don't Miss!
- News పవన్ అప్పుల చిట్టా రూ. 46,70,00,000: `వదిన` దగ్గర పర్సనల్ లోన్
- Sports CSKకి కొత్త సమస్య.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఎలా?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఫోటోలు: క్రికెట్ గ్రౌండ్లో గొడవ.. తెలంగాణ పోలీసులతో మహేష్ బాబు భేటీ!
Recommended Video
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మకమైన తన 25 వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రతిభగల దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర యూనిట్ డెహ్రా డూన్ లో కాలేజీ సన్నివేశాలని ఫినిష్ చేసుకుని వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లో మరో షెడ్యూల్ కి రెడీ అవుతోంది. భరత్ అనే నేను చిత్రం విజయం తరువాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజగా మహేష్ బాబు తెలంగాణ పోలీస్ లతో భేటీ కావడం ఆసక్తి రేపుతోంది.
కీలక షెడ్యూల్
హైదరాబాద్ లో మొదలు కానున్న కీలక షెడ్యూల్ కు చిత్ర యూనిట్ సిద్ధం అవుతోంది. ఈ షెడ్యూల్ లో సినిమాకే హైలైట్ కానున్న క్రికెట్ గ్రౌండ్ సన్నివేశాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కించబోతున్నారు.
యాక్షన్ సీన్
క్రికెట్ స్టేడియంలో తన స్నేహితులతో మహేష్ బాబు మ్యాచ్ ఆడే సన్నివేశం, ఆ తరువాత యాక్షన్ సన్నివేశం చిత్రీకరించనున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం పోలీస్ అకాడమీ గ్రౌండ్ ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.
పోలీసులతో మహేష్
అకాడమీ గ్రౌండ్ లో షూటింగ్ అనుమతి కోసం మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కలసి తెలంగాణ పోలీసులని కలిశారు. షూటింగ్ కు అనుమతి ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మహేష్ పోలీసులతో భేటీ అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అల్లరి నరేష్ కూడా
అల్లరి నరేష్ ఈ చిత్రంలో మహేష్ స్నేహితుడిగా నటిస్తున్నాడు. ఈ షెడ్యూల్ లో అల్లరి నరేష్ కూడా పాల్గొంటాడని వార్తలు వస్తున్నాయి. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు, అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.