రచ్చ..రచ్చ చేస్తున్న మహేష్ బాబు ( యాడ్ క్యాంపైన్ ఫోటోలు)

By Srikanya

హైదరాబాద్: థమ్స్అప్ సాఫ్ట్ డ్రింక్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న మహేష్ బాబు తాజాగా ఆ కంపెనీకి ఓ కొత్త యాడ్ చేసారు. థమ్స్ అప్ కంపెనీ 'తూఫాన్' పేరిట మరో యాడ్ చిత్రీకరించింది. ఇందులో మహేష్ బాబు హెలికాప్టర్‌తో చేసే స్టంట్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఇవాళ ఏదోటి అదరకొడ్తాం అంటూ వచ్చే ఈ యాడ్ క్యాంపైన్ ఇప్పుడు ఫ్యాన్స్ లో చర్చనీయాంసంగా మారింది.

ఈ కొత్త యాడ్ క్యాంపైన్ పిభ్రవరి 24నుంచి మొదలవుతోంది. మహేష్ లాంటి సూపర్ స్టార్ తో ఈ క్యాపైన్ చేయటంతో ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు పండాయని టీమ్ అంటోంది. ఓ సూపర్ స్టార్ ఇలాంటి యాడ్ చేస్తే దాని ప్రభావం ఖచ్చితంగా మార్కెట్ పై ఉంటుంది. సేల్స్ పెరుగుతాయని కంపెనీ వర్గాలు చెప్తున్నాయి.

ఇంతవరకూ "ఆజ్ కుచ్ తూఫానీ కర్తే హై" అంటూ ధమ్స్ అప్ నేషనల్ యాడ్ లో యాక్షన్ తో కనిపించి అలరించిన మహేష్ బాబు ఇక కనిపించరు. ఆయన ప్లేస్ లోకి సల్మాన్ ఖాన్ వచ్చి చేరారు. ఇంతకుముందు అక్షయ్ కుమార్ ప్లేస్ లోకి మహేష్ బాబు వచ్చి చేరారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్.. ధమ్స్ అప్ కి నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు. కోకోకోలా ఇండియా ప్రెవేట్ లిమెటెడ్ వారు సల్మాన్ తో ఎగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే ఇందులో గుడ్ న్యూస్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ కి మాత్రం మహేష్ బాబే కొనసాగుతారు.

రచ్చ..రచ్చ చేస్తున్న మహేష్ బాబు ( యాడ్ క్యాంపైన్ ఫోటోలు)

కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కాదు. మొత్తం దక్షిణాదిలో వ్యాపార ప్రకటనల్లో నటిస్తూ, మిగతా అందరికన్నా ఎక్కువ డబ్బు సంపాదిస్తోంది మహేష్‌ బాబు. ఈ ప్రకటనతో మహేష్ ని మరిన్ని టాప్ బ్రాండ్ లు సంప్రదించే అవకాసం ఉంది.

రచ్చ..రచ్చ చేస్తున్న మహేష్ బాబు ( యాడ్ క్యాంపైన్ ఫోటోలు)

పరిశ్రమలో వినపడేదాని ప్రకారం మహేష్‌ ఇప్పటివరకూ వివిధ కంపెనీలకు పనిచేయడం ద్వారా 35 నుంచి 40 కోట్ల రూపాయల వరకూ తీసుకున్నారని అంచనా.

రచ్చ..రచ్చ చేస్తున్న మహేష్ బాబు ( యాడ్ క్యాంపైన్ ఫోటోలు)

ఫిల్మ్‌ స్టార్ల బ్రాండింగ్‌ ఇమేజ్‌లో 20 శాతానికి పైగా మహేష్‌ సొంతం.

రచ్చ..రచ్చ చేస్తున్న మహేష్ బాబు ( యాడ్ క్యాంపైన్ ఫోటోలు)

మహేష్ నటించిన వ్యాపార ప్రకటనలు తమిళనాడు, కర్నాటకల్లోని పత్రికల్లో, ఆయా భాషల టివి చానళ్ళలో ప్రసారం అవుతుంటాయి

రచ్చ..రచ్చ చేస్తున్న మహేష్ బాబు ( యాడ్ క్యాంపైన్ ఫోటోలు)

ఏ సినీ రంగంలోనైనా టాప్‌ వన్ పొజిషన్‌లో ఉండే హీరోలను మాత్రమే తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేసుకునే థమ్స్‌ అప్‌ చిరంజీవి తరువాత మహేష్‌ బాబును ఆశ్రయించింది.

రచ్చ..రచ్చ చేస్తున్న మహేష్ బాబు ( యాడ్ క్యాంపైన్ ఫోటోలు)

థమ్స్‌ అప్‌ వంటి ఎన్నో కంపెనీలు తమ మొత్తం అమ్మకాల్లో 20 శాతం ఆంధ్రప్రదేశ్‌ నుంచే వస్తాయని వెల్లడించాయి.

రచ్చ..రచ్చ చేస్తున్న మహేష్ బాబు ( యాడ్ క్యాంపైన్ ఫోటోలు)

దేశం మొత్తం మీద పానీయాలకు అతిపెద్ద మార్కెట్‌గా ఆంధ్రతో పాటు కర్నాటకలు నిలువగా, తదుపరి స్థానంలో పంజాబ్‌ ఉంది. అందుకే ఉత్తరాదికి ఒకరిని ఎంపిక చేసుకునే కంపెనీలు సౌత్‌ ఇండియా కోసం కనీసం ఇద్దర్ని ఆశ్రయించాల్సి వస్తోంది.

రచ్చ..రచ్చ చేస్తున్న మహేష్ బాబు ( యాడ్ క్యాంపైన్ ఫోటోలు)

అందులో ఒకరు ఖచ్చితంగా తెలుగు సెలబ్రిటీగా ఉండేలా చూసుకుంటున్నాయి. వారిలో మహేష్ ని ఎంచుకుంటున్నారు.

రచ్చ..రచ్చ చేస్తున్న మహేష్ బాబు ( యాడ్ క్యాంపైన్ ఫోటోలు)

గత నాలుగైదేళ్ళుగా ఈ సంస్థ చిత్రించిన వివిధ ప్రకటనల్లో మహేష్‌ కనిపిస్తూ, అభిమానులను అలరించారు.

రచ్చ..రచ్చ చేస్తున్న మహేష్ బాబు ( యాడ్ క్యాంపైన్ ఫోటోలు)

దీంతో పాటు ఐటిసి, యూనివర్‌సెల్‌, అమృతాంజన్‌, నవరత్న ఆయిల్‌, ఐడియా సెల్యులార్‌, వివెల్‌, ప్రొవోగ్‌ వంటి కంపెనీలతోనూ మహేష్ జతకట్టి ఒప్పందం కుదుర్చుకున్నారు.

రచ్చ..రచ్చ చేస్తున్న మహేష్ బాబు ( యాడ్ క్యాంపైన్ ఫోటోలు)

తమ బ్రాండిక్ కి ఏ సంస్థ అయినా ఎనిమిది కోట్ల రూపాయల వరకూ మహేష్‌ బాబుకు చెల్లించడానికి ముందుకొస్తున్నట్లు సమాచారం.

రచ్చ..రచ్చ చేస్తున్న మహేష్ బాబు ( యాడ్ క్యాంపైన్ ఫోటోలు)

పలు కార్పొరేట్‌ కంపెనీలు మహేష్‌ బాబు కాదన్న తరువాతే ఇతర హీరోలతో ఒప్పందాలకు వెళ్ళినట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X