Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ట్రాఫిక్ రూల్స్ ఉల్లఘించిన మహేష్, బాలయ్య.. పవన్కు రూ. 505 ఫైన్!
Recommended Video
హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై ద్రుష్టి పెట్టారు. నిబంధలను పాటించని ప్రముఖులపై కొరడాఝుళిపిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా భాద్యత రాహిత్యంగా వాహనాల్లో వెళ్లిన టాలీవుడ్ సినీ ప్రముఖుల జాబితాని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. వీరిలో కొంత మందికి ఎన్నిసార్లు ఫైన్ విధించిన డబ్బు చెల్లించలేకపోతున్నారని పోలీసులు తెలిపారు. ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణతో పాటు మరికొంతమంది హీరోలు ఉన్నారు.
మూడేళ్ళలో మహేష్ బాబు 7 సార్లు
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిలో మహేష్ బాబు ముందు వరుసలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మహేష్ బాబు గత మూడేళ్ళ కాలంలో 7 సార్లు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూడేళ్ళ కాలంలో మహేష్ బాబుకు చెందిన ఏపీ 09 సిఎం 4005 నెంబరు కారుపై 8,745 రూపాయలు జరిమానా నమోదై ఉంది. కానీ మహేష్ బాబు ఇంతవరకు జరిమానా చెల్లించలేదు. ఇకపై జరిమానా చెల్లినచకుంటే కఠిన చర్యలు ఉంటాయని మహేష్ బాబు అంటున్నారు.
పవన్ కళ్యాణ్, బాలయ్య ఎంతో తెలుసా
చలానాలు చెల్లించని వారి జాబితాలో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ పేర్లు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కు చెందిన కారు నంబరు ఏపీ 09 సీజీ 7778 పై మూడుసార్లు చలానా విధించబడింది. ఈ మేరకు పవన్ ట్రాఫిక్ చలానా కింద రూ.505 బకాయి పడ్డట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు మాదాపూర్, బంజారా హిల్స్ పోలీసులు ఈ చలానా విధించారు. ఇక నందమూరి బాలకృష్ణ పై రాజేంద్రనగర్ లో ఫైన్ విధించబడింది. బాలయ్య అతివేగంతో ప్రయాణించిన కారణంగా 1,035 రూపాయలు జరిమానా విధించారు.
ఔటర్ రింగ్ రోడ్పై సునీల్ వేగం
ఇక యంగ్ హీరో నితిన్ పై కూడా జరిమానా నమోదై ఉంది. అల్వాల్ ఏరియాలో నితిన్ ట్రాఫిక్ రూల్స్ ని బ్రేక్ చేసినందుకు గాను రూ 1,035 జరిమానాని పోలీసులు విధించారు. కమెడియన్, హీరో సునీల్ మాదాపూర్, ఔటర్ రింగ్ రోడ్డులో అతివేగంతో వాహనాన్ని నడిపిన కారణంగా ఇప్పటివరకు జరిమానా రూపంలో రూ 4,540 బకాయి పడ్డట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ వివరాలతో సదరు హీరోలని మరోమారు హెచ్చరించారు. చలానాలు చెల్లించాలని ఆదేశించారు.
10కి మించితే
10 చలనాలు మించి నమోదైతే వారిపై కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాం అని పోలీసులు హెచ్చరించారు. 30 చలానాలకు మించితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు, కేసు నమోదు అవుతుందని తెలిపారు. పోలీసులు ట్రాఫిక్ నిభందలపై ఎన్ని చైతన్య వంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా పరిస్థితి మారడం లేదు. ఈ విషయంలో ప్రక్షాళన అవసరం అని, సెలెబ్రిటీల నుంచే అది ప్రారంభం కావాలని పోలీసులు చెబుతున్నారు.