Don't Miss!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
ఆ పార్టీకి ఎన్నికల్లో మహేష్ ప్రచారం.. చంద్రబాబు అంటే గౌరవం, కానీ.. నమ్రత!
సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈ మధ్య ఎక్కువగా రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు మీడియా నుంచి ఎదురవుతున్నాయి. మహేష్ మాత్రం తనకు రాజకీయాలపై ఆసక్తిలేదని అలాంటి ప్రశ్నలు అడగవద్దని మీడియాకు చెబుతూనే ఉన్నాడు. మహేష్ బాబుకు కొందరు రాజకీయ ప్రముఖులు బంధువులుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మహేష్ బాబు ప్రచారంలో పాల్గొంటాడనే ఊహాగానాలు అధికం అవుతున్నాయి. ఈ వార్తలపై మహేష్ సతీమణి నమ్రత ఓ ఇంటర్వ్యూలోస్పందించారు.
రాజకీయ ప్రముఖులు
గల్లా జయదేవ్, ఘట్టమనేని ఆది శేషగిరిరావు లాంటి ప్రముఖ రాజకీయ నాయకులు మహేష్ బాబుకు బంధువులు. వీళ్ళిద్దరూ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మహేష్ బాబు సోదరి పద్మావతి భర్తే గల్లా జయదేవ్. గల్లా జయదేవ్ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అమర్ రాజా సంస్థ అధినేతగా వ్యాపారాల్లో కూడా రాణిస్తున్నారు. ఇక సీనియర్ పొలిటీషియన్ ఘట్టమనేని ఆది శేషగిరిరావు సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు.
ఆ పార్టీకి ప్రచారం
ఇలా తన బంధువులంతా తెలుగుదేశం పార్టీలో ఉండడంతో మహేష్ బాబు రాబోవు ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున ప్రచారం చేస్తారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. మహేష్ బాబు గురించి ఇలా వార్తలు వస్తుండడంతో మహేష్ అభిమానుల్లో కూడా ఆసక్తి నెలకొంది. మహేష్ సతీమణి నమ్రత ఈ వార్తలపై స్పందిస్తూ.. తన భర్త ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారనే వార్తలని ఖండించారు.
తరుణ్ భాస్కర్ దర్శత్వంలో మహేష్ బాబు!
పొలిటికల్ ఫిగర్ చేయొద్దు
నమ్రత మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం చంద్రబాబు చేస్తున్న కార్యక్రమాల పట్ల మహేష్ కు గౌరవం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దానిని మహేష్ గర్వకారణంగా భావిస్తాడు. చంద్రబాబు నాయుడు పట్ల గౌరవం ఉన్నంత మాత్రాన తన భర్తని పొలిటికల్ ఫిగర్ చేయొద్దని నమ్రత కోరింది. మహేష్ బాబు ఏ రాజకీయ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదని నమ్రత తేల్చి చెప్పింది.
కనీసం ఫ్రెండ్స్ని కూడా కలవరు
మహేష్ ఇంతకు ముందు ఎప్పుడైనా పొలిటికల్ స్పీచ్ లు ఇచ్చారా.. అలాంటప్పుడు ఆయన గురించి ఈ పుకార్లు ఎందుకు వస్తున్నాయి అని నమ్రత ప్రశ్నించారు. మహేష్ షూటింగ్ లతో బిజీగా ఉంటున్నాడు. దొరికిన కొద్ది సమయాన్ని మా కోసం కేటాయిస్తున్నారు. కానీసం తన స్నేహితులని కలుసుకునేందుకు కూడా మహేష్ బయటకు వెళ్ళరు అని నమ్రత తెలిపింది.
రియల్ శ్రీమంతుడిగా
మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రం తర్వాత తన తండ్రి స్వగ్రామం బుర్రిపాళెంని దత్తత తీసుకుని అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఈ దేశాన్ని నడిపించే రాజకీయ నాయకులన్నా, రాజకీయ పార్టీలన్నా మహేష్ బాబుకు గౌరవం ఉంది. కానీ ఆయనకు రాజకీయాలపై ఆసక్తి లేదు అని నమ్రత ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు వంశీపైడిపల్లి దర్శకత్వంలో శ్రీమంతుడు చిత్రంలో నటిస్తున్నాడు.