Don't Miss!
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Sports SRH ఎఫెక్ట్తో IPLలో కొత్త రూల్: బౌలర్లకు గుడ్ & బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్!
- Technology 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- News రాయలసీమ నెత్తిన పాలు పోసిన మోడీ
- Finance IT News: ఇది శిక్ష-శిక్షణా.. TCS టెక్కీల కన్నీళ్లు.. అన్నంతపని చేసేసిన టెక్ దిగ్గజం..
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: సుప్రీం కోర్టులో విచారణ.. రెండు నెలలు గడువు కోరిన కేంద్రం!
గత ఏడాది వెలుగులోకి వచ్చిన టాలీవుడ్ డ్రగ్స్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. టాలీవుడ్ సినీప్రముఖులు కొందరిని ప్రత్యేక దర్యాప్తు విభాగం పోలీసులు విచారించారు కూడా. విచారణ ఎదుర్కొన వారిలో హీరోలు, దర్శకులు, హీరోయిన్లు కూడా ఉన్నారు. కొన్ని రోజులు తరువాత ఈ వ్యవహారం చల్లబడింది.
ప్రముఖ దర్శక నిర్మాత టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై సీబీఐ విచారణ జరపాలని అప్పట్లో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజగా ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. డ్రగ్స్ వాడకం చాలా తీవ్రమైన అంశం కావడంతో సుప్రీం కోర్టు కేంద్రానికి ప్రశ్నలు సంధించింది.
డ్రగ్స్ నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని సూటిగా ప్రశ్నించింది. దీనిపై విధివిధానాలు రూపొందించాలని కూడా సుప్రీం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం రెండు నెలల గడువు కోరగా, సుప్రీం తదుపరి విచరణని సెప్టెంబర్ 10 కి వాయిదా వేసింది.