Don't Miss!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: సుప్రీం కోర్టులో విచారణ.. రెండు నెలలు గడువు కోరిన కేంద్రం!
గత ఏడాది వెలుగులోకి వచ్చిన టాలీవుడ్ డ్రగ్స్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. టాలీవుడ్ సినీప్రముఖులు కొందరిని ప్రత్యేక దర్యాప్తు విభాగం పోలీసులు విచారించారు కూడా. విచారణ ఎదుర్కొన వారిలో హీరోలు, దర్శకులు, హీరోయిన్లు కూడా ఉన్నారు. కొన్ని రోజులు తరువాత ఈ వ్యవహారం చల్లబడింది.
ప్రముఖ దర్శక నిర్మాత టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై సీబీఐ విచారణ జరపాలని అప్పట్లో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజగా ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. డ్రగ్స్ వాడకం చాలా తీవ్రమైన అంశం కావడంతో సుప్రీం కోర్టు కేంద్రానికి ప్రశ్నలు సంధించింది.
డ్రగ్స్ నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని సూటిగా ప్రశ్నించింది. దీనిపై విధివిధానాలు రూపొందించాలని కూడా సుప్రీం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం రెండు నెలల గడువు కోరగా, సుప్రీం తదుపరి విచరణని సెప్టెంబర్ 10 కి వాయిదా వేసింది.