Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: సుప్రీం కోర్టులో విచారణ.. రెండు నెలలు గడువు కోరిన కేంద్రం!
గత ఏడాది వెలుగులోకి వచ్చిన టాలీవుడ్ డ్రగ్స్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. టాలీవుడ్ సినీప్రముఖులు కొందరిని ప్రత్యేక దర్యాప్తు విభాగం పోలీసులు విచారించారు కూడా. విచారణ ఎదుర్కొన వారిలో హీరోలు, దర్శకులు, హీరోయిన్లు కూడా ఉన్నారు. కొన్ని రోజులు తరువాత ఈ వ్యవహారం చల్లబడింది.
ప్రముఖ దర్శక నిర్మాత టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై సీబీఐ విచారణ జరపాలని అప్పట్లో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజగా ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. డ్రగ్స్ వాడకం చాలా తీవ్రమైన అంశం కావడంతో సుప్రీం కోర్టు కేంద్రానికి ప్రశ్నలు సంధించింది.
డ్రగ్స్ నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని సూటిగా ప్రశ్నించింది. దీనిపై విధివిధానాలు రూపొందించాలని కూడా సుప్రీం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం రెండు నెలల గడువు కోరగా, సుప్రీం తదుపరి విచరణని సెప్టెంబర్ 10 కి వాయిదా వేసింది.