Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: సుప్రీం కోర్టులో విచారణ.. రెండు నెలలు గడువు కోరిన కేంద్రం!
గత ఏడాది వెలుగులోకి వచ్చిన టాలీవుడ్ డ్రగ్స్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. టాలీవుడ్ సినీప్రముఖులు కొందరిని ప్రత్యేక దర్యాప్తు విభాగం పోలీసులు విచారించారు కూడా. విచారణ ఎదుర్కొన వారిలో హీరోలు, దర్శకులు, హీరోయిన్లు కూడా ఉన్నారు. కొన్ని రోజులు తరువాత ఈ వ్యవహారం చల్లబడింది.
ప్రముఖ దర్శక నిర్మాత టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై సీబీఐ విచారణ జరపాలని అప్పట్లో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజగా ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. డ్రగ్స్ వాడకం చాలా తీవ్రమైన అంశం కావడంతో సుప్రీం కోర్టు కేంద్రానికి ప్రశ్నలు సంధించింది.
డ్రగ్స్ నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని సూటిగా ప్రశ్నించింది. దీనిపై విధివిధానాలు రూపొందించాలని కూడా సుప్రీం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం రెండు నెలల గడువు కోరగా, సుప్రీం తదుపరి విచరణని సెప్టెంబర్ 10 కి వాయిదా వేసింది.