Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మహేష్ - త్రివిక్రమ్- పవన్ స్కిట్ గురించి సురేష్ బాబు
హైదరాబాద్: ఈ నెల 30 జరిగే ‘మేము సైతం' కార్యక్రమం గురించి తెలుగు సినిమా అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హుధూద్ తుఫాన్ బాధితుల కోసం నిధుల సేకరణలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల కార్యక్రమాలు ఎన్ని ఉన్నా.....అందరూ ఓ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అది మరేదో కాదు.....మహేష్ బాబు, త్రివిక్రమ్, పవన్ కళ్యాన్ కలిసి చేసే స్కిట్ కోసం. అసలు వీరిలో ఏ ఒక్కరు స్కిట్ చేసినా అంచనాలు ఓ రేంజిలో ఉంటాయి. అలాంటిది ముగ్గురు కలిసి స్కిట్ చేస్తే టాప్ లేచి పోవాల్సిందే. సోమవారం జరిగిన మేము సైతం ప్రెస్ మీట్లో నిర్మాత సురేష్ బాబు ఈ స్కిట్ గురించి ప్రముఖంగా ప్రస్తావించారు.
పవన్, త్రివిక్రమ్, మహేష్ బాబు కలిసి ఓ స్కిట్ చేస్తారు. అదే విధంగా ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి కలిసి మరో స్కిట్ చేస్తున్నారు. మంచు విష్ణు, మనోజ్ రెండు టీములుగా విడిపోయి కబడ్డీ ఆడుతున్నారు అని సురేష్ బాబు తెలిపారు.