Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మురుగదాస్ 'రెండు జంటల ప్రేమకథ'
గజని దర్శకుడు మురుగదాస్ ఇప్పుడు మరో ప్రేమ కథతో ముందుకొస్తున్నాడు. అయితే అది ఆయన డైరక్ట్ చేయటం లేదు. ఆయన శిష్యుడు ఎం.శరవణన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శర్వానంద్, అనన్య, జై, అంజలి ఇందులో ప్రధాన పాత్రధారులు. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని సురేష్ కొండేటి తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ సినిమా గురించి సురేష్ మాట్లాడుతూ మురుగదాస్ ఓ హాలీవుడ్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు జంటల మధ్య సాగే ప్రేమ కథతో ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రెండు జంటల కథలు విడివిడిగా సాగినా, ముగింపులో మాత్రం కథలకు లింకు ఉంటుంది. ఇంకా పేరుపెట్టని ఈ చిత్రానికి బలమైన కథా కథనం తోడై మంచి కమర్షియల్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
కోలీవుడ్లో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా అనువాద హక్కుల కోసం పలువురు తెలుగు నిర్మాతలు భారీ ఎత్తున పోటీపడ్డారు. చివరకు ఈ చిత్రాన్ని నేను దక్కించుకున్నాను. మా సంస్థ నుంచి గతంలో వచ్చిన ప్రేమిస్తే, షాపింగ్మాల్, నాన్న చిత్రాల్లాగే ఇది కూడా విజయం సాధిస్తుంది. సత్య సంగీత దర్శకుడు. ఇందులో సన్నివేశాలే కాదు. పాటలు కూడా హృదయాలను తాకుతాయి. త్రీకె ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ సమర్పణలో, ఎస్.పిక్చర్స్ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం అన్నారు. ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో సూర్య హీరోగా 'సెవెన్త్సెన్స్" చిత్రం రూపొంది విడుదలకు రెడీ అవుతోంది.