Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సురేష్ ప్రొడక్షన్స్ తాజా చిత్రం ‘ఆలస్యం అమృతం’ రిజల్ట్ ఏంటి?
నిఖిల్, మదాల్స శర్మ జంటగా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డా. డి.రామానాయుడు నిర్మించిన 'ఆలస్యం అమృతం" మొన్న శుక్రవారం విడుదలైంది. కామిడీ ప్రాధానంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు పెద్దగా పట్టటం లేదని ట్రేడ్ రిపోర్టు. కథ చూస్తే..కోటీశ్వరుడు కూతురైన వైదేహి(మదాలస శర్మ) తనకు నచ్చని పెళ్లి చేస్తున్నారని, ఆత్మహత్య చేసుకోవాలని ఫిక్సై ఇంట్లోనుంచి పారిపోయి అన్నవరం లో దిగుతుంది. అక్కడి నుండి విజయవాడ వెళ్లి కనక దుర్గ ముడుపు తీర్చి అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనేది ఆమె ఆలోచన. అందుకోసం అన్నవరం రైల్వే స్టేషన్ కు వచ్చి సింహాద్రి ఎక్సప్రెస్ కోసం ఎదురు చూస్తూ సూసైడ్ నోట్ రాస్తుంటే అది కాస్త ఎగిరి పోతుంది. ఆ నోట్ ని పట్టుకునే క్రమంలో ఓ చిన్నబాబు స్టేషన్ లో ఉన్న బెంచ్ మీద నుండి పడిపోబోతుంటే పట్టుకుంటుంది. సరిగ్గా అదే సమయానికి రామ్ (నిఖిల్) కూడా బాబుని పట్టుకుంటాడు. నిఖిల్ కూడా అన్నవరం వచ్చి మొక్కు తీర్చుకుని తన ఊరుకి వెళ్ళటానికి స్టేషన్ కి వస్తాడు.
ఇక ఇద్దరూ ఒకేసారి పట్టుకున్న ఆ బాబు ఒంటిరిగా ఉన్నాడని...వాడిని ఎవరో వదిలి వెళ్లి పోయారని తర్వాత అర్దం చేసుకుంటారు. ఈ లోగా సింహాద్రి ఎక్స్ ప్రెస్ వచ్చే టైం కావడంతో ఆ ట్రైన్ ఎక్కడానికి రకరకాల మనుషులు వస్తారు.దాంతో కంగారుపడ్డ నిఖిల్..ఆ బాబును వాడి తల్లిదండ్రులకు అప్పజెప్పే వరకు ట్రైన్ ఆలస్యంగా వస్తే బాగుండు అనుకుంటాడు. అలాగే ఆలస్యం అవుతుంది ట్రైన్. అక్కడి నుంచి ఓ పక్క ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్న మనుషులు చేసే హంగామా, మరో పక్క నిఖిల్..బాబు తల్లి తండ్రులను వెతుకున్న సమయంలో తన పక్కన ఉన్న వైదేహి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది అని రివిల్ అవుతుంది. దాంతో ట్రైన్ మరికాస్త లేట్ అయితే ఈ అమ్మాయిని కూడా మారుస్తా అని కోరుకోగానే అలానే జరుగుతుంది. ఇక అక్కడి నుంచి నిఖిల్ రైలు ఆలస్యంగా వచ్చే ఆ కొద్ది సమయంలో ఏ విదంగా బాబు అమ్మ నాన్నలను కనిపెట్టాడు. వైదేహి మనసు మార్చి ఆత్మ హత్య ఆపాడు అన్నది మిగిలిన కధ. యేలేటి చంద్రశేఖర్ ప్రయాణం చిత్రాన్ని గుర్తు చేసే ఈ చిత్ర కథనమే ఈ సినిమాకి మైనస్ గా మారి ప్రేక్షకుల పాలిట నసగా మారింది. దర్శకత్వం కూడా టీవీ ఎపిసోడ్స్ తీసినట్లుగా ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ అనే ముద్ర లేకపోతే ఈ సినిమా గురించి పట్టించుకోవటం అనవరసం అని అంటున్నారు.