పెద్ద మనసు చాటుకున్న సూర్య, కార్తీ.. 25 లక్షల సాయం!
కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తీ మరో మారు పెద్ద మనసు చాటుకున్నారు. కేరళలో కుంభ వృష్టి కారణంగా వరదలు వచ్చిన సంగతి తెలిసిందే. అనుకోకుండా వచ్చిన ఈ ప్రకృతి విపత్తుకు చాలా మంది రోడ్డున పడ్డారు. కేరళ ప్రభుత్వం సహాయ చర్యలు చేపడుతోంది. సాయం చేయడంతో ఎప్పుడూ ముందుండే సూర్య, కార్తీ వరద బాధితుల కోసం సాయం అందించారు.
సూర్య, కార్తీ కలసి సీఎం సహాయ నిధికి 25 లక్షల ఆర్థిక సాయం అందించారు. గతంలో కూడా సూర్య, కార్తీ రైతులకు సాయం అందించిన సంగతి తెలిసిందే. ఆపద సమయంలో వెంటనే సాయం అందించిన ఈ బ్రదర్స్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.

సినిమాల విషయానికి వస్తే కార్తీ ఇటీవల రైతు నేపథ్యం నటించిన చినబాబు చిత్రంతో మంచి విజయం సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రం ఎమోషనల్ హిట్ గా నిలిచింది. ఇక సూర్య రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నాడు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఎన్ జి కె చిత్రంలో, కెవి ఆనంద్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నాడు.ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











