Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పెద్ద మనసు చాటుకున్న సూర్య, కార్తీ.. 25 లక్షల సాయం!
కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తీ మరో మారు పెద్ద మనసు చాటుకున్నారు. కేరళలో కుంభ వృష్టి కారణంగా వరదలు వచ్చిన సంగతి తెలిసిందే. అనుకోకుండా వచ్చిన ఈ ప్రకృతి విపత్తుకు చాలా మంది రోడ్డున పడ్డారు. కేరళ ప్రభుత్వం సహాయ చర్యలు చేపడుతోంది. సాయం చేయడంతో ఎప్పుడూ ముందుండే సూర్య, కార్తీ వరద బాధితుల కోసం సాయం అందించారు.
సూర్య, కార్తీ కలసి సీఎం సహాయ నిధికి 25 లక్షల ఆర్థిక సాయం అందించారు. గతంలో కూడా సూర్య, కార్తీ రైతులకు సాయం అందించిన సంగతి తెలిసిందే. ఆపద సమయంలో వెంటనే సాయం అందించిన ఈ బ్రదర్స్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.
సినిమాల విషయానికి వస్తే కార్తీ ఇటీవల రైతు నేపథ్యం నటించిన చినబాబు చిత్రంతో మంచి విజయం సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రం ఎమోషనల్ హిట్ గా నిలిచింది. ఇక సూర్య రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నాడు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఎన్ జి కె చిత్రంలో, కెవి ఆనంద్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నాడు.ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు ఉన్నాయి.