Just In
- 20 min ago
రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ రూమర్స్ అన్ని అబద్ధాలే!
- 30 min ago
బిగ్ బాస్ 5 మొదలయ్యేది ఎప్పుడంటే.. మరోసారి సోహెల్ కూడా..
- 1 hr ago
ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
- 2 hrs ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
Don't Miss!
- News
ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల పూర్తి షెడ్యూల్: మొత్తం 4 దశల్లో, జనవరి 29 నుంచి ప్రక్రియ మొదలు
- Finance
ఒక్కరోజులో రూ.2.08 లక్షల కోట్ల సంపద హాంఫట్: 3 రోజుల్లో 1800 పాయింట్లు..
- Sports
ముగ్గురు స్టార్ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే.. వాట్సన్ స్థానం అతనిదేనా?
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పకడ్బందీ స్క్రిప్టుతో వస్తే నటించేందుకు సిద్ధమే : సూర్య
సూర్య నటించిన 'సింగం' ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. గతంలో వచ్చిన 'యముడు'కి ఇది సీక్వెల్. ఈ చిత్రం రిలీజైన మొదటి రోజే రికార్డు ఓపినింగ్స్ తో విడుదలైంది. అలాగే కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ నేపధ్యంలో ఆయన తెలుగు మీడియాతో మాట్లాడారు.
ఇక ''దక్షిణాదిలో సీక్వెల్ చిత్రాలకు విజయం దక్కదని అందరూ అంటారు. నేను 'సింగం'లో నటించడం మొదలుపెట్టినప్పుడు ఇలాగే అన్నారు. కానీ నాకు దర్శకుడు హరి మీద నమ్మకం ఉంది. అనుకున్న దాన్ని ఆయన బాగా తెరకెక్కించగలరు. దర్శకుడి మీద ఉంచిన నమ్మకం నిజమైంది. మమ్మల్ని నిరాశపరిచిన వారి మాటలు కేవలం అపోహలే అని తేలిపోయాయి''అన్నారు సూర్య.
అలాగే ''ఇంతకు ముందు వచ్చిన 'యముడు', ఇప్పుడు విడుదలైన 'సింగం' సినిమాల్లో ఏది బాగుంది అంటే నేను చెప్పలేను. మీరు చిన్నప్పుడు అందంగా ఉన్నారా.. పెద్దయ్యాక బాగున్నారా అంటే చెప్పగలరా.. ఇదీ అంతే. యముడులో నరసింహం ఓ ఎస్సైగా జీవితం మొదలుపెడతాడు.. ఆ తర్వాత ఉన్నత స్థానాలకు చేరతాడు. అందులో కేవలం రాష్ట్రంలో జరిగే ఘటనలను అడ్డుకుంటాడు. 'సింగం'లో మన దేశంలో జరిగే విదేశీ మాఫియా కార్యకలాపాల్ని అడ్డుకుంటాడు. ఏ సినిమాకి ఆ సినిమానే బాగున్నాయి. రెండింటిలోనూ వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్నాయి'' అని చెప్పారు.