Don't Miss!
- News సెంటిమెంట్ కలిసొస్తే - అదే ఫలితం రిపీట్...!!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
బెల్లంకొండ బ్యానర్ లో సూర్య కొత్త చిత్రం
బెల్లంకొండ సురేష్ త్వరలో సూర్య నటించిన మాత్రన్ చిత్రం రైట్స్ తీసుకోనున్నారు. కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం 2012 సమ్మర్ కి విడుదల కానుంది.రంగం దర్శకుడు కెవి ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్ ఆయన సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక సూర్య నటించిన తాజా చిత్రం సెవెంత్ సెన్స్ రీసెంట్ గా విడుదలైంది. ఆ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నా మంచి ఓపినింగ్స్ ని తెచ్చుకుంది. అంతేగాక కలెక్షన్స్ సైతం తమిళనాడులో బాగున్నాయి. ఇక బెల్లంకొండ సురేష్ విషయానికి వస్తే ఆయన రీసెంట్ గా అజిత్ చిత్రం గాంబ్లర్ ని డబ్బింగ్ చేసి విడుదల చేసారు. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఇక రీమేక్ చేస్తున్న గంగ చిత్రం విడుదలకు సిద్దమైంది.
త్రిష, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రాన్ని గోపీచంద్ మలినేని డైరక్ట్ చేసారు. మళయాళంలో సూపర్ హిట్ అయిన బాడీగార్డ్ చిత్రానికి రీమేక్ అది. ఈ చిత్రంపై వెంకటేష్ బాగా ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఈ చిత్రం అనంతరం నందినీరెడ్డి దర్సకత్వంలో సిద్దార్ధ హీరోగా చిత్రం నిర్మిస్తున్నారు. ఇక ఈ సంవత్సరం బెల్లంకొండ సురేష్ కి బాగా కలిసి వచ్చింది. లారెన్స్ దర్సకత్వంలో వచ్చిన కాంచన చిత్రం, రామ్ హీరోగా చేసిన కందిరీగ రెండూ హిట్టవటం బెల్లంకొండ సురేష్ కి మరిన్ని చిత్రాలు చేసే దిశగా ప్రేరేపిస్తున్నాయి.