Don't Miss!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆ పత్రికకు వార్నింగ్ ఇచ్చిన హీరో సూర్య, ఏమైంది?
హైదరాబాద్: సౌత్ స్టార్ సూర్యకు తమిళనాడుతో పాటు ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. కేవలం నటన మాత్రమే కాదు... మంచి నడవడిక, వ్యక్తిత్వం, సేవాభావం ఇలా అన్ని కలిసి సూర్యకు ఒక యూనిక్ గుర్తింపు తెచ్చి పెట్టాయి, పెద్ద స్టార్ ను చేసాయి.
ఎప్పుడూ చిరు నవ్వుతో ప్రశాంతంగా కనిపించే సూర్య ఇటీవల తన గురించి ఓ పత్రికలో వచ్చిన వార్త సంగతి తెలిసిందే ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే ఆ పత్రికకు వార్నింగ్ ఇస్తూ ప్రెస్ రిలీజ్ జారీ చేసారు.
సూర్య ఆగ్రహానికి గురి కావడానికి కారణం మలేషియాకు చెందిన పత్రిక. మలేషియా దేశంలో తమిళ జనాభా ఎక్కువే. అక్కడ తమిళ స్టార్లకు మంచి ఫాలోయింగే ఉంది. పలువురు స్టార్లు తరచూ మలేషియాలో జరిగే కొన్ని కార్యక్రమాలకు హాజరవుతుంటారు కూడా.
అయితే ఇటీవల ఓ మతపరైమన సంస్థ తమ కార్యక్రమంలో పాల్గొనడానికి సూర్యను ఆహ్వానించిందని.. సూర్య అందుకోసం డబ్బులు డిమాండ్ చేశాడని మలేషియాకు చెందిన ఓ పత్రిక కథనం రాసింది.
తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఈ వార్త ఉండటంతో దీన్ని సూర్య సీరియస్ గా తీసుకున్నాడు. ఆ పత్రికకు వార్నింగ్ ఇస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు సూర్య. తాను మత పరమైన కార్యక్రమాల్లో ఎప్పుడూ పాల్గొనని, మలేషియాలో ఏ కార్యక్రమానికీ తనను ఎవరూ ఆహ్వానించలేదని చెప్పాడు. తన గురించి ఇలాంటి నిరాధార వార్తలు ప్రచురిస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానని అతను హెచ్చరించాడు. ః