Don't Miss!
- News ఎన్నికల్లో కీలక ఘట్టం ..నేటి నుంచే నామినేషన్లు షూరూ
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
సుశాంత్ ‘అడ్డా’ తాజా సంగతులు
హైదరాబాద్: సుశాంత్, శాన్వి జంటగా శ్రీ నాగ్ కార్పొరేషన్ పతాకంపై జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'అడ్డా'. చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 50 శాతం పూర్తయింది. ప్రస్తుతం ధోలారి ధనిలో ఫైట్స్ చిత్రీకరిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్నపూర్ణ, ఆర్ఎఫ్సి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశామని, అక్టోబర్ 1 నుండి 25 రోజులపాటు షూటింగ్ జరుపుతామని, ఆ తరువాత రెండు పాటల చిత్రీకరణ యూరోప్లో ఉంటుందని తెలిపారు. నవంబర్లో ఆడియోను విడుదలచేసి డిసెంబర్లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని మరో నిర్మాత ఎ.నాగసుశీల తెలిపారు.
దర్శకుడు జి.ఎస్.కార్తీక్ మాట్లాడుతూ... ''ప్రేమ భావనపై ముసురుకున్న అపోహల్ని తొలగించే చిత్రమిది. నిజమైన ప్రేమకు అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి సన్నివేశం వినోదాత్మకంగా సాగుతుంది. భావోద్వేగాలకు ప్రాధాన్యముంది. సుశాంత్ నటన కొత్త పంథాలో సాగుతుంది''అన్నారు.
కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, రఘుబాబు, నాగినీడు, వేణుమాధవ్, తాగుబోతు రమేష్, నల్ల వేణు, ధన్రాజ్, స్వప్నిక తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఎస్.అరుణ్కుమార్, ఎడిటింగ్:శ్రీనివాస్, నిర్మాతలు : చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: జి.ఎస్.కార్తీక్.