Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కన్ఫర్మ్: త్రివిక్రమ్ సినిమాలో అల్లు అర్జున్తో పాటు మరో హీరో
గతేడాది భారీ అంచనాల నడుమ 'నా పేరు సూర్య' సినిమా రావడం, అది కాస్తా బాక్సాఫీస్ వద్ద డీలా పడటంతో కాస్త స్లో అయిన అల్లు అర్జున్.. ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలతో హంగామా చేయబోతున్నాడు. ఈ మూడు కథల్లో కూడా విలక్షణత ఉంటుందని, బన్నీ డిఫెరెంట్ యాగిల్ చూస్తామని ప్రచారం జరుగుతోంది. కాగా ఆ మూడింటిలో ప్రత్యేకమైన సినిమాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డిఫెరెంట్ యాంగిల్స్లో సినిమాలు తీయడంలో దిట్ట. ఇక ఆయన సినిమాల్లో డైలాగ్స్ గురించి చెప్పతరమా! దీంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది.
అయితే ఆ హైప్ రెట్టింపయ్యేలా తాజాగా ఓ హీరో.. తాను కూడా బన్నీ- త్రివిక్రమ్ ప్రాజెక్టులో నటిస్తున్నానని ట్వీట్ చేయడం టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. అక్కినేని నాగార్జున మేనల్లుడు, యంగ్ హీరో సుశాంత్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడట. ఈ విషయాన్ని సుశాంత్ స్వయంగా ట్విటర్ వేదికగా ప్రకటించాడు. AA19కి సంబంధించి నా ఫస్ట్ అప్డేట్ అని పేర్కొంటూ.. ''అల్లు అర్జున్ 19వ సినిమా సెట్స్లో ఇదే నాకు మొదటి రోజు.
నాకెంతో ఇష్టమైన దర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్, అలాగే 'ఆర్య' సినిమా టైమ్ నుంచే నేనెంతో అభిమానిస్తున్న బన్నీ, సీనియర్ హీరోయిన్ టబు, నా స్నేహితురాలు పూజా హెగ్డే, పీఎస్ వినోద్, తమన్ వంటి వారితో కలిసి ఈ సినిమాలో పనిచేస్తుండడం చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తోంది. ఈ అవకాశం ఇచ్చినందుకు చిత్ర యూనిట్కి ధన్యవాదాలు. 'చిలసౌ' తర్వాత నేను చేస్తున్న ఈ సినిమా నాకు మరో సాహసం లాంటిది. ఈ చిత్రబృందం నుంచి నేనెంతో నేర్చుకోగలనని నమ్ముతున్నా'' అని ట్వీట్ లో వెల్లడించాడు సుశాంత్.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు ఓ కీలక పాత్రలో కనిపించనుండటం ఆసక్తికర అంశం. ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవలే రెండో షెడ్యూల్ షూటింగ్ లోకి అడుగు పెట్టింది.