Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
నాగార్జున మేనల్లుడు 'అడ్డా'లో అడుగు పెట్టాక...
నిర్మాత చింతలపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ... నిత్యం ప్రేమికులదే అక్కడ సందడి. కళ్లల్లోకి కళ్లు పెట్టి చూసుకొంటూ ఊసులు చెప్పుకొంటుంటారు. కప్పు టీని కొన్ని గంటలపాటు ఆస్వాదిస్తూనే ఉంటారు. అలాంటి ప్రేమికుల అడ్డాలోకి ఓ జంట వచ్చి చేరింది. గమ్మత్తేమిటంటే... ఆ ఇద్దరికీ ప్రేమపై సదభిప్రాయం లేదు. మరి అక్కడికొచ్చాక వాళ్ల మనసులు ఎలా మారిపోయాయో తెరపైనే చూడాలంటున్నారు.
హీరో సుశాంత్ మాట్లాడుతూ...ప్రేమ పేరు చెబితే అటు పెద్దవాళ్లలోనూ ఇటు యువతలోనూ చిన్నపాటి గందరగోళం ఉంటుంది. అందుకు కారణాలను వినోదాత్మకంగా మా చిత్రంలో చూపిస్తున్నాము. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రస్తుతం వస్తున్న ప్రేమకథలకు భిన్నంగా పాజిటివ్ థాట్తో ఉంటుంది అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ..''నేటితరం సరైన భాగస్వామిని ఎంపిక చేసుకొంటోందా? లేదా? అనే కోణంలో సాగే కథ ఇది. నవంబరు నెలాఖరులోపు చిత్రీకరణ పూర్తవుతుంద''అని వివరించారు.
మరో నిర్మాత ఎ.నాగసుశీల మాట్లాడుతూ''జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకొనే క్రమంలో యువతరం ఎలా తడబాటుకు గురవుతోందనే విషయాన్ని దర్శకుడు చెప్పిన తీరు ఆకట్టుకొంటుంది. డిసెంబరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు . కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, రఘుబాబు, నాగినీడు, వేణుమాధవ్, స్వప్నిక ఇతర పాత్రధారులు. ఛాయాగ్రహణం: ఎస్.అరుణ్కుమార్, సంగీతం: అనూప్ రూబెన్స్. నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, నాగసుశీల, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: జి.సాయికార్తీక్.