వెకేషన్: ఫుల్లుగా ఎంజాయ్ చేసిన హీరోయిన్... (ఫోటోలు, వీడియోలు)
ముంబై: ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి సుష్మితా సేన్ ఈ మధ్య అసలు వార్తల్లో కనపించడమే లేదు. ప్రస్తుతం సినిమాలు బాగా తగ్గించేసిన ఆమె తన ఇద్దరు దత్త పుత్రికలు రెనీ సేన్, అలీషా సేన్లతో ఎక్కువగా గడిపేందుకే ఆమె సమయం కేటాయిస్తున్నారు.
ఇటీవల తన ఇద్దరు కూతుర్లతో కలిసి థాయ్ లాండ్ వెకేషన్ వెళ్లిన సుష్మితా సేన్ అక్కడ ఇద్దరు కూతుర్లతో కలిసి ఎంజాయ్ చేసిన ఫోటోలు, వీడియోలు అభిమానులతో షేర్ చేసుకున్నారు. అక్కడ టైగర్ టెంపుల్లో పులులతో గడిపిన ఫోటోలను, సముద్ర తీరంలో గడిపిన సరదా వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు స్లైడ్ షోలో చూడొచ్చు..
ఇక సుష్మితా సేన్ సినిమాల విషయానికొస్తే.. గతేడాది నిర్బాక్ అనే బెంగాళీ చిత్రంలో నటించిన ఆమె తర్వాత సినిమాలేవీ కమిట్ కాలేదు. ప్రస్తుతం తాను ఇద్దరు కూతుర్లతో సంతోషంగా గడుపుతున్నానని, ప్రస్తుతం వారు ఎదుగుతున్నారు, ఈ సమయంలో వారి బాగోగులు తానే స్వయంగా చూసుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని సుష్మితా సేన్ అంటున్నారు.
స్లైడ్ షోలో ఫోటోలు, వీడియోలు...

సుస్మితా సేన్
థాయ్ లాండ్ టైగర్ టెంపుల్లో సుస్మితా సేన్.

పెద్ద కూతురు
థాయ్ లాండ్ టైగర్ టెంపుల్లో సుస్మితా సేన్ పెద్ద కుమార్తె రెనీ సేన్

చిన్న కూతురు
థాయ్ లాండ్ టైగర్ టెంపుల్లో సుస్మితా సేన్ చిన్న కూతురు అలిషా
బీచ్ లో..
థాయ్ లాండ్ బీచ్ లో తన ఇద్దరు కూతుర్లతో కలిసి ఎంజాయ్ చేస్తున్న సుస్మిత
హ్యాపీ మూమెంట్స్
థాయ్ లాండ్ వెంకేషన్లో హ్యాపీ మూమెంట్స్


Click it and Unblock the Notifications











