Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సుస్మితా సేన్ వేశ్యగా 'ఒసేయ్..మల్లమ్మ'
మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్ ప్రధాన పాత్రలో చేసిన హిందీ చిత్రం 'చింగారి' ఇప్పుడు తెలుగులో 'ఒసేయ్..మల్లమ్మ' పేరుతో డబ్బింగవుతోంది. ఉత్తరప్రదేశ్లోని రంగ్పూర్ గ్రామానికి చెందిన ఓ వేశ్య వాస్తవ జీవితగాథ ఆధారంగా ప్రఖ్యాత దర్శకురాలు కల్పనాజ్మీ ఈ చిత్రం రూపొందించింది. ఇక చిత్ర కథ ప్రకారం ప్రజలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించే ఓ గ్రామాధికారి ప్రతిరోజూ ఓ వేశ్యతో గడుపుతుంటాడు. కాలక్రమంలో ఆమె తనకంటూ ఓ ఆనందమయ జీవితాన్ని ఆశించి ఓ పోస్ట్మ్యాన్ని ప్రేమిస్తుంది. అది సహించని గ్రామాధికారి ఆ పోస్ట్మ్యాన్ని చంపిస్తాడు. దాంతో ఉగ్రరూపం దాల్చిన వేశ్య ఆ గ్రామాధికారిని ఎలా హతం చేస్తుందనేది క్లైమాక్స్. గ్రామాధికారిపై ఆమె తిరగబడే సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ఉంటాయి.వేశ్య పాత్రని సుస్మితా సేన్ పోషించగా, గ్రామాధికారి పాత్రను మిథున్ చక్రవర్తి చేసారు. ఇక ఈ చిత్రాన్ని జె పాండురంగారెడ్డి తెలుగులో అందిస్తున్నారు.