Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘సువర్ణ సుందరి’ టీజర్కు రెస్పాన్స్ అదుర్స్
జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సువర్ణ సుందరి టీజర్ విడుదలైంది. ఇదొక హిస్టారికల్ అడ్వంచర్ మూవీ. సూర్య దర్శకుడు. డిసెంబర్లో సినిమా విడుదల కానుంది.
చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది.. ఇది సువర్ణ సుందరి చిత్ర ట్యాగ్ లైన్. ఈ లైన్ కి తగ్గట్టుగానే ఉంది సువర్ణ సుందరి చిత్ర టీజర్. విజువల్ వండర్ గా చూడగానే ఆకట్టుకుంటోంది సువర్ణ సుందరి టీజర్. జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లొ ఎమ్.ఎల్.లక్ష్మి ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
హిస్టారికల్ అడ్వంచర్ మూవీ
హిస్టారికల్ అడ్వెంచర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ''1509 సంవత్సరంలో ప్రారంభమై నేటి(2017) వరకూ.. అంటే నాలుగు శతాబ్ధాల్లో జరిగే కథ ఇది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. కాలాదుల్ని బట్టి వేర్వేరు లొకేషన్లలో చిత్రీకరణ చేశామని దర్శకుడు సూర్య తెలిపారు.
హైలెట్స్
దర్శకుడు సూర్య టేకింగ్తో పాటు, ఎలు మహంతి విజువల్స్, సాయి కార్తీక్ స్టన్నింగ్ ఆర్.ఆర్ టీజర్ లో హైలెట్ గా చెప్పుకోవచ్చు. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా తెరకెక్కిన సువర్ణ సుందరి డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. బీదర్, కేరళ, కాలక్కల్, అనంతపూర్, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రదేశాల్లో చిత్రీకరణ జరిగింది. రోలర్ కాస్టర్ స్క్రీన్ప్లేలో ఈ కథ ఉంటుంది.
చీకటి కోణాలుంటాయి
చరిత్ర ఎప్పుడూ విజయాల గురించి చెబుతుంది. అయితే చరిత్రలో బయటికి తెలీని చీకటి కోణాలుంటాయి. అలాంటి ఓ చీకటి కోణం ఇప్పటివరకు రకరకాల జనరేషన్లపై ఎలాంటి ప్రభావం చూపించింది అన్నదే ఈ చిత్రంలోని ప్రధాన కథాంశం. అప్పటి జనరేషన్, ఇప్పటి జనరేషన్ గ్యాప్ని అర్థవంతంగా చూపించేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నామని దర్శకుడు తెలిపారు.
ముఖ్యపాత్రలు, టెక్నీషియన్స్
జయప్రద,పూర్ణ, సాక్షిచౌదరి, రామ్, ఇంద్ర, సాయికుమార్, నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్ ఖాన్, అవినాష్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: ఎలు మహంతి, సంగీతం: సాయి కార్తిక్, ఎడిటింగ్: పవ్రీణ్ పూడి.