Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
రవీంద్రభారతిలో దాసరికి ఎస్వీ ఆర్ పురస్కారం...!
సుప్రసిద్ధ నటులు స్వర్గీయ ఎస్వీ రంగారావు పురస్కారాన్ని దాసరి నారాయణరావు ప్రదానం చేయనున్నట్లు జీవీఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ తెలిపింది. జూలై 3వ తేదీ ఎస్వీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో రామానాయుడు, మోహన్ బాబు, జయసుధ తదితర సినీప్రముఖులు పాల్గొంటారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా, ఆంధ్రప్రభ సంపాదకులు శ్రీ పి.విజయబాబు, విశిష్ట అతిథిగా, మాజీమంత్రి మండలి బుద్ధప్రసాద్, ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి హనుమంతరావు, డాక్టర్ శ్రీనివాసరెడ్డి, సి.రామకృష్ణ, డాక్టర్ పావులూరి శివరామయ్య, డాక్టర్ అనగాని మంజుల, ఆత్మీయ అతిథులు పాల్గొంటున్నారు.
సభా కార్యక్రమానికి ముందు పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు శిష్యురాలు కుమారి కీర్తి బృందంచే కూచిపూడి నృత్యవిభావరి ఉంటుందని జీవీఆర్, ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ అధ్యక్షులు గుదిబండి వెంకటరెడ్డి తెలిపారు.