Don't Miss!
- News జగన్ సీఎం కావాలని చెప్పుల్లేకుండా అభిమాని దీక్ష-స్వయంగా వెళ్లి విరమింపజేసిన వైనం..!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
రవీంద్రభారతిలో దాసరికి ఎస్వీ ఆర్ పురస్కారం...!
సుప్రసిద్ధ నటులు స్వర్గీయ ఎస్వీ రంగారావు పురస్కారాన్ని దాసరి నారాయణరావు ప్రదానం చేయనున్నట్లు జీవీఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ తెలిపింది. జూలై 3వ తేదీ ఎస్వీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో రామానాయుడు, మోహన్ బాబు, జయసుధ తదితర సినీప్రముఖులు పాల్గొంటారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా, ఆంధ్రప్రభ సంపాదకులు శ్రీ పి.విజయబాబు, విశిష్ట అతిథిగా, మాజీమంత్రి మండలి బుద్ధప్రసాద్, ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి హనుమంతరావు, డాక్టర్ శ్రీనివాసరెడ్డి, సి.రామకృష్ణ, డాక్టర్ పావులూరి శివరామయ్య, డాక్టర్ అనగాని మంజుల, ఆత్మీయ అతిథులు పాల్గొంటున్నారు.
సభా కార్యక్రమానికి ముందు పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు శిష్యురాలు కుమారి కీర్తి బృందంచే కూచిపూడి నృత్యవిభావరి ఉంటుందని జీవీఆర్, ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ అధ్యక్షులు గుదిబండి వెంకటరెడ్డి తెలిపారు.