Don't Miss!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అమావాస్య ఉంది, ‘సీతమ్మ వాకిట్లో..’ ప్రీమియర్ షోలు వేస్తాం : దిల్రాజు
హైదరాబాద్ : మహేష్ బాబు-వెంకటేష్ మల్టీ స్టారర్గా రూపొందుతున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 11న గ్రాండ్గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ రోజు అమావాస్య అవుతుండటంతో ముందు రోజు ప్రీమియర్ షోలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ విషయమై నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ....'11వ తేదీ అమావాస్య కాబట్టి జనవరి 10 రాత్రి ప్రీమియర్ షోలు వేస్తున్నాం. అయితే ఒకే ప్రీమియర్ షోనా లేక అంతకంటే ఎక్కువ ప్రీమయర్ షోలా అనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తాము ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత ప్రీమియర్ షోలు ఎన్ని? ఎక్కడ? అనే విషయాలు వెల్లడిస్తానని తెలిపారు.
పోస్టు ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం మరికొన్ని రోజుల్లో సెన్సర్ కార్యక్రమాలు పూర్తి చేసుకోబోతోంది. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాబట్టి క్లీన్ సర్టిఫికెట్ వస్తుందని అంతా భావిస్తున్నారు. సంక్రాంతి హాలీడేస్ సీజన్ కావడంతో ఓపెనింగ్స్ భారీగా వస్తాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని భారీ సంఖ్యలో థియేటర్లను కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్పై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో పూర్తి కుటుంబ కథా చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్గా నటిస్తోంది. వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి మరో హీరోయిన్ రోల్ చేసింది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈచిత్రాన్ని తెరక్కిస్తున్నారు. రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమా ప్రభ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, పాటలు: సిరి వెన్నెల సీతారామశాస్త్రి.