twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మగర్‌ పట్టా సిటీలో మహేష్ చిత్రం షూటింగ్

    By Srikanya
    |

    పూణే: మహేష్ తాజాగా మహారాష్ట్రలోని పుణేలో సందడి చేసారు. అక్కడి మగర్‌ పట్టా సిటీ అనే ప్రదేశంలో ఆయన తాజా చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం చిత్రీకరణ సాగింది. ఈ సందర్భంగా పుణెలోని తెలుగు సాఫ్ట్ వేర్‌ ఇంజినీర్లు, తెలుగు కుటుంబాలవారు షూటింగ్ లొకేషన్ కి భారీగా తరలివచ్చారు. అక్కడి తెలుగువారిలో ఈ చిత్రం షూటింగ్ ఉత్సాహాన్ని రేపింది.

    ఇక సంక్రాంతి సందర్భంగా చిత్రాన్ని జనవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత దిల్ రాజు తెలిపారు. మహేష్,వెంకటేష్ అన్నదమ్ములుగా నటించిన ఈ చిత్రం పాటల్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. మిక్కీ జె.మేయర్‌ స్వరాలు సమకూర్చారు. ఇందులో సమంత, అంజలి, ప్రకాష్‌రాజ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కొత్త బంగారులోకం తో పరిచయమైన శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు.

    ''పేరులోనే కాదు, సినిమాలోనూ తెలుగుదనం కనిపిస్తుంది. ఇద్దరు హీరోలను ఒకే తెరపై చూపించడం మంచి కథ ఉంటేనే సాధ్యం. అలాంటి కథ ఈ సినిమాలో ఉంది. కుటుంబ విలువలకు పెద్దపీట వేశాము''అని దర్శకుడు చెప్తున్నారు. ఇందులో ఒక్క పాత్ర కూడా వృథాగా ఉండదు. ఒక్క సీన్ వేస్ట్‌గా ఉండదు. అంత పగడ్బందీ స్క్రీన్‌ప్లేతో సినిమాను రూపొందిస్తున్నాం. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నన్ను దర్శకుడిగా పరిచయం చేసిన ఆయన బేనరులోనే రెండో సినిమా కూడా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో సాగే కథే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. కథలో భావోద్వేగాలు అందరినీ కదిలిస్తాయి. వెంకటేష్‌, మహేష్‌బాబుల పాత్రలు అందరికీ గుర్తుండిపోతాయి. సీత పాత్ర కథలో చాలా కీలకం. ప్రకాష్‌రాజ్‌ మరోసారి ఓ ఉదాత్తమైన పాత్రలో కనిపిస్తారు. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఈ సినిమా నాంది అవుతుంది అన్నారు.

    ఆస్తిపాస్తుల ముందు అన్నదమ్ముల బంధాలకు విలువ లేని కాలమిది. చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అనుకొంటూ ఎవరి బతుకులు వాళ్లు బతికేస్తున్నారు. ఇలాంటి రోజుల్లో కూడా నాన్న దగ్గర చేసిన వాగ్ధానం కోసం ఆ అన్నదమ్ములు ఏం చేశారో తెర మీదే చూడాలంటున్నారు దిల్‌ రాజు. ఆయన నిర్మిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'... మల్టీస్టారర్‌ చిత్రాల్లో ఇదో ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గొప్పదనాన్ని, అనుబంధాల విలువనీ హృద్యంగా చెప్పే ప్రయత్నమిది దిల్ రాజు అన్నారు . సంగీతం: మిక్కీ జే.మేయర్‌, సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌.

    English summary
    The song shoot of Venkatesh and Mahesh Babu starer 'Seetamma Vakitlo Sirimalle Chettu' has begun at Pune, Today. The song is a duet which is being shot on Mahesh ans Samantha and it will be completed in five days. With this, the film’s shooting part will be completed except for one song.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X