Don't Miss!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
ఇదో సేఫ్ గేమ్: మొదటి సినిమానే సీక్వెల్
హైదరాబాద్: తొలి చిత్రం ఏ దర్శకుడుకి అయినా పెద్ద పరీక్షే. అన్నాళ్లూ సినీ పరిశ్రమలో తను నేర్చుకున్నది ఏమన్నది ఆ చిత్రంతో తేలిపోతుంది. ఇవన్నీ ఆలోచించేనేమో ...సీక్వెల్ తో తన లాంచింగ్ కి రెడీ అవుతున్నాడు ఓ కొత్త దర్శకుడు. నిఖిల్, స్వాతి జంటగా సుధీర్వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన స్వామిరారా సీక్వెల్ ని సిద్దం చేసుకుని, రంగం లోకి దూకుతున్నాడు ఎన్.బోస్ అనే నూతన దర్శకుడు.
ఎన్.బోస్... స్వామి రారా దర్శకుడు వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన అనుభవంతో ఈ చిత్రం రూపొందించటానికి సిద్దపడుతున్నారు. స్వామి స్వామి రారా అనే టైటిల్తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ది సాగా కంటిన్యూస్ అనేది ఉపశీర్షిక. ఎన్.బోస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని స్వామిరారా చిత్రాన్ని నిర్మించిన చక్రి చిగురుపాటి లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించబోతున్నాడు.
నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ... నవ్యతతో కూడిన కథాంశంతో సినిమాలు రూపొందిస్తే ఆ చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ తప్పక వుంటుందని స్వామిరారా చిత్రం మరోసారి నిరూపించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ను నిర్మించబోతున్నాం. ఓ స్టార్ హీరో నటించనున్న ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా, హై బడ్జెట్తో, హై టెక్నికల్ వాల్యూస్తో తెరకెక్కించనున్నాం. త్వరలోనే సెట్స్మీదకు వెళ్ళనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత బీఎస్ వర్మ.