twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇదో సేఫ్ గేమ్: మొదటి సినిమానే సీక్వెల్

    By Srikanya
    |

    హైదరాబాద్: తొలి చిత్రం ఏ దర్శకుడుకి అయినా పెద్ద పరీక్షే. అన్నాళ్లూ సినీ పరిశ్రమలో తను నేర్చుకున్నది ఏమన్నది ఆ చిత్రంతో తేలిపోతుంది. ఇవన్నీ ఆలోచించేనేమో ...సీక్వెల్ తో తన లాంచింగ్ కి రెడీ అవుతున్నాడు ఓ కొత్త దర్శకుడు. నిఖిల్, స్వాతి జంటగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన స్వామిరారా సీక్వెల్ ని సిద్దం చేసుకుని, రంగం లోకి దూకుతున్నాడు ఎన్.బోస్ అనే నూతన దర్శకుడు.

    ఎన్.బోస్... స్వామి రారా దర్శకుడు వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన అనుభవంతో ఈ చిత్రం రూపొందించటానికి సిద్దపడుతున్నారు. స్వామి స్వామి రారా అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ది సాగా కంటిన్యూస్ అనేది ఉపశీర్షిక. ఎన్.బోస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని స్వామిరారా చిత్రాన్ని నిర్మించిన చక్రి చిగురుపాటి లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మించబోతున్నాడు.

    'Swamy Raa Raa' gets a sequel now

    నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ... నవ్యతతో కూడిన కథాంశంతో సినిమాలు రూపొందిస్తే ఆ చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ తప్పక వుంటుందని స్వామిరారా చిత్రం మరోసారి నిరూపించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ను నిర్మించబోతున్నాం. ఓ స్టార్ హీరో నటించనున్న ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా, హై బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కించనున్నాం. త్వరలోనే సెట్స్‌మీదకు వెళ్ళనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత బీఎస్ వర్మ.

    English summary
    Swamy Raa Raa producer Chakri Chigurupati who made the movie is now planning a sequel to it. The sequel is titled. Swamy Swamy Raa Raa is the title and it has the tagline of 'The saga continues'. The film will be directed by A N Bose.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X