హాట్ అండ్ హర్రర్ సీన్లతో వస్తున్న మూవీ (ఫోటోస్)
హైదరాబాద్: మనోజ్-అలీషా జంటగా అరుణోదయ మూవీ మేకర్స్ పతాకంపై సౌమిత్రి(దుర్గా ప్రసాద్.వై) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న హార్రర్ ఎంటర్టెనర్ ‘స్వర్ణ మహల్'. ఉమ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
స్వర్ణ మహల్ ఫస్ట్ మరియు టీజర్ ను మార్చి నెలలో విజయవాడలో ఆవిష్కరించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు ఉమ మాట్లాడుతూ...‘పూర్తి స్థాయిలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకొన్న సినిమా ఇది. హార్రర్ ఎంటర్టెనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలోని సస్పెన్స్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది.
ముఖ్యంగా సినిమాలోని 40 నిమిషాల నిడివిగల గ్రాఫిక్స్ ప్రేక్షకులకు కనువిందు చేస్తాయి. మార్చిలో విజయవాడలో ఫస్ట్ లుక్ టీజర్ ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరింపచేసి, అదే నెల చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోలు...

అరుణోదయ మూవీ మేకర్స్
మనోజ్-అలీషా జంటగా అరుణోదయ మూవీ మేకర్స్ పతాకంపై సౌమిత్రి(దుర్గా ప్రసాద్.వై) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న హార్రర్ ఎంటర్టెనర్ ‘స్వర్ణ మహల్'.

మార్చిలో విడుదల
మార్చిలో విజయవాడలో ఫస్ట్ లుక్ టీజర్ ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరింపచేసి, అదే నెల చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు నిర్మాత

నటీనటలు
మనోజ్, అలీషా, ధనేకుల బంచంద్, రామరాజు, సుమన్ శెట్టి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

టెక్నీషియన్స్
ఈ చిత్రానికి కెమెరా: హరీష్, ఎడిటింగ్: మమ, విజువల్ ఎఫెక్ట్స్: సుడిపో(జేమ్స్), సంగీతం: హెచ్.కె.బృంద, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: కొర్రిబిల్లి సత్తిబాబు,అంకిరెడ్డి, టివి రావు, సమర్పణ: ఉమ, రచన, నిర్మాణం, దర్శకత్వం: సౌమిత్రి.


Click it and Unblock the Notifications