Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నిర్మాత కొడుకుతో కలర్స్ స్వాతి రొమాన్స్!
హైదరాబాద్: కలర్స్ స్వాతి ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ఆమె నటించిన త్రిపుర మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద యావరేజ్ ఫలితాలు సాధించింది. అయితే స్వాతి పెర్ఫార్మెన్స్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కలర్స్ స్వాతి మరో ప్రాజెక్టు కమిటైనట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో ఆమె హీరోయిన్ గా ఖరారైనట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి గుండెజారి గల్లంతయ్యిందే ఫేమ్ విజయ్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, అందులో ఒక హీరోయిన్ గా స్వాతిని ఎంపిక చేసినట్లు టాక్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. కన్నడ నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు సమాచారం.
ప్రస్తుతం బెల్లకొండ శ్రీనివాస్ భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. తమిళ్ లో విజయం సాధించిన సుందరపాండ్యిన్ రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది. తమిళంలో విజయంతమైన 'సుందరిపాండ్యన్' ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి 'స్పీడున్నోడు' అనే పేరు ప్రచారంలో ఉంది.
తెలుగులో రీమేక్ సినిమాలు తీయడంలో పెట్టింది పేరు... భీమనేని శ్రీనివాసరావు. ఇదివరకు ఆయన తీసిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి. రెండు సంవత్సరాల క్రితం కిందట నరేష్తో 'సుడిగాడు' చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకొన్నారు. తాజాగా ఈ సినిమాను రూపొందించి విడుదలకు సన్నాహాలు చేసుకొంటున్నారు.