Don't Miss!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- News అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే సెక్యూరిటీ గార్డు ?, పిల్లర్ కు కట్టేసి పిండేసి, అంతే !
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
నిర్మాత కొడుకుతో కలర్స్ స్వాతి రొమాన్స్!
హైదరాబాద్: కలర్స్ స్వాతి ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ఆమె నటించిన త్రిపుర మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద యావరేజ్ ఫలితాలు సాధించింది. అయితే స్వాతి పెర్ఫార్మెన్స్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కలర్స్ స్వాతి మరో ప్రాజెక్టు కమిటైనట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో ఆమె హీరోయిన్ గా ఖరారైనట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి గుండెజారి గల్లంతయ్యిందే ఫేమ్ విజయ్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, అందులో ఒక హీరోయిన్ గా స్వాతిని ఎంపిక చేసినట్లు టాక్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. కన్నడ నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు సమాచారం.
ప్రస్తుతం బెల్లకొండ శ్రీనివాస్ భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. తమిళ్ లో విజయం సాధించిన సుందరపాండ్యిన్ రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది. తమిళంలో విజయంతమైన 'సుందరిపాండ్యన్' ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి 'స్పీడున్నోడు' అనే పేరు ప్రచారంలో ఉంది.
తెలుగులో రీమేక్ సినిమాలు తీయడంలో పెట్టింది పేరు... భీమనేని శ్రీనివాసరావు. ఇదివరకు ఆయన తీసిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి. రెండు సంవత్సరాల క్రితం కిందట నరేష్తో 'సుడిగాడు' చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకొన్నారు. తాజాగా ఈ సినిమాను రూపొందించి విడుదలకు సన్నాహాలు చేసుకొంటున్నారు.