Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కలర్స్ స్వాతి కొత్త చిత్రం ఫస్ట్ లుక్ (పోస్టర్)
హైదరాబాద్: కలర్స్ స్వాతి ప్రస్తుతం 'త్రిపుర' అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. తమిళ చిత్రానికి 'తిరుపుర సుందరి' అనే టైటిల్ ని ఖరారు చేశారు. క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'గీతాంజలి' ఫేం రాజ కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి స్టేజికి చేరుకుంది. ఈ సందర్బంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు. మీరు ఇక్కడ చూస్తున్నది అదే.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
నిర్మాతలు చినబాబు, రాజశేఖర్ లు మాట్లాడుతూ - '' రాజకిరణ్ దర్శకత్వంలో రూపొందిన 'గీతాంజలి'కి మించిన ఉత్కంట భరితంగా ఈ చిత్రం ఉంటుంది. స్వాతి మంచి నటి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఈ చిత్రంలో టైటిల్ రోల్ ను అద్భుతంగా చేస్తోంది. ఇప్పటి వరకు చిత్రీకరించిన సన్నివేశాలను ఎడిటింగ్ చేసి రష్ చూసాము. చాలా అధ్బుతంగా వచ్చింది. '' అన్నారు.
దర్శకుడు రాజకిరణ్ మాట్లాడుతూ- "కోన వెంకట్, వెలిగొండ శ్రీనివాస్ సమకూర్చిన స్ర్కీన్ ప్లే ప్రధాన బలంగా నిలుస్తుంది. కమ్రాన్ అద్భుతమైన పాటలు స్వరపరిచారు. ఇందులో ఉన్న నాలుగు పాటలకు చంద్రబోస్, రామజోగయ్య శాస్ర్తి సాహిత్యం అందిస్తున్నారు" అని చెప్పారు.
ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే : కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ, మాటలు: రాజా, సినిమాటోగ్రఫీ: రవికుమార్ సానా, ఎడిటింగ్: ఉపేంద్ర, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, నిర్మాతలు: ఎ.చినబాబు, ఎమ్.రాజశేఖర్, కథ-దర్సకత్వం: రాజకిరణ్, సమర్పణ: జె.రామాంజనేయులు.