Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
నందమూరి హీరో సరసన శ్వేతాబసు ఎంపిక
హైదరాబాద్
:
కొత్త
బంగారు
లోకం
చిత్రంతో
పరిచయమైన
శ్వేతాబసు
గుర్తుండే
ఉంటుంది.
బాగా
వళ్ళు
చేసి
వేషాలకు
దూరమైన
ఆమె
తాజాగా
మరో
చిత్రంలో
ఎంపికైంది.
తారకరత్న
హీరోగా
వి.
దొరస్వామిరాజు
నిర్మిస్తున్న
చిత్రం
'విజేత
లో
ఆమె
హీరోయిన్
గా
తీసుకున్నారు.
ఈ
చిత్రంలో
అల్లు
అర్జున్
తో
వరుడు
చిత్రంతో
పరిచయమైన
భానుశ్రీ
మెహ్రా
కూడా
నటిస్తోంది.
ఉదయ్భాస్కర్
దర్శకుడు.
ఈ విషయమై నిర్మాత దొరస్వామి రాజు మాట్లాడుతూ...''నాగార్జున నటించిన 'కిరాయిదాదా'తో నిర్మాతగా నా ప్రస్థానం మొదలైంది. ఎందరో హీరోలతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశాను. నందమూరి తారకరత్నతో ఇప్పుడు తీస్తున్న 'విజేత' నిజంగా అతన్ని విజేతగా నిలుపుతుంది'' అన్నారు. వీఎంసీ కంబైన్స్ పతాకంపై రాజు నిర్మిస్తున్న 'విజేత' చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది.
తారకరత్న మాట్లాడుతూ ...వి.ఎం.సి సంస్థలో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతని ఆకట్టుకునే సినిమా ఇది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ 'జూ.ఎన్టీఆర్తో 'సింహాద్రి' వంటి విజయవంతమైన సినిమాను అందించిన సంస్థ ఇప్పుడు తారకరత్నతో చేస్తున్న 'విజేత' కూడా అదే స్థాయి విజయాన్ని సాధిస్తుంది. ఫ్యామిలీ, లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది' అన్నారు.
తారకరత్న, శ్వేతాబసుప్రసాద్, భానుశ్రీ మెహ్రా ఇందులో నాయకానాయికలు. ముహూర్తపు దృశ్యానికి టి.ప్రసన్నకుమార్ కెమెరా స్విచాన్ చేయగా, తమ్మారెడ్డి భరద్వాజ్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా తారకరత్న మాట్లాడుతూ -''నేనింతవరకూ ఇలాంటి పాత్ర చేయలేదు. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా ఇది'' అని చెప్పారు. సెప్టెంబరు వరకూ ఏకధాటిగా చిత్రీకరణ జరుపుతామని బ్యాంకాక్, అరకులోయల్లో పాటలు చిత్రీకరిస్తామని కార్యనిర్వాహక నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు.