Don't Miss!
- News ప్రధాని మోదీ ఎదుటే కాలు మీద కాలు వేసుకుని కూర్చొన్న టీడీపీ ఎమ్మెల్యే.. తరువాత రియాక్షన్ ఏమిటంటే..?
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Lifestyle శరీరంలో ఈ భాగాల్లో వాపు కనబడుతుంటే, పక్కా మీ లివర్ డ్యామేజ్ అయ్యిందని అర్థం..!హెచ్చరిక
- Automobiles ప్రతి 14 నిమిషాలకు ఓ కారు మాయం.. అత్యధికంగా కార్లు చోరీ అయ్యేది ఈ నగరాల్లోనే.!!
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
- Sports Shreyanka Patil: ఆటతోనే కాదు..అందంతోనూ క్లీన్ బౌల్డే!
శ్వేతా బసు మళ్లీ వస్తోంది, ఇక బుల్లితెరపై...
హైదరాబాద్: తెలుగులో కొత్త బంగారు లోకం సహా పలు చిత్రాల్లో నటించిన హీరోయిన్ శ్వేతా బసు గురించి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆమె వ్యబిచారం కేసులో ఇరుక్కోవడం, కొంత కాలం రెస్య్కూ హోంలో గడపడం, తాను తప్పు చేయలేదని కోర్టులో ప్రూవ్ కావడంతో బయటకు రావడం తెలిసిందే.
ఈ ఉదంతం తర్వాత హైదరాబాద్ నుండి మకాం ఉత్తేసిన శ్వేతా బసు... తన సొంతూరైన ముంబైలోనే ఉంటోంది. అక్కడే పలు సినిమా సంస్థల్లో పని చేస్తూ మళ్లీ కెరీర్లో ఎదిగే ప్రయత్నం చేస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆమె ‘దార్ సబ్ కో లగ్ తా హై' అనే హారర్ సీరియల్ కు ఆమె సైన్ చేసినట్లు సమాచారం.
శ్వేతా బసు బాలనటిగా టీవీ సీరియల్స్ ద్వారానే కెరీర్ మొదలు పెట్టింది. హిందీలో పెద్ద హిట్టయిన టీవీ సీరియల్ ‘కహానీ ఘర్ ఘర్ కి'లో శ్వేతా బసు అప్పట్లో శృతి అనే పాత్ర పోషించింది. ఈ సీరియల్ లో శ్వేతా బసు నటనను చూసిన దర్శకుడు ‘మక్డీ' అనే చిత్రంలో అవకాశం ఇచ్చారు.
ఈ సినిమా తర్వాత శ్వేతా బసుకు తెలుగులో కొత్త బంగారు లోకంలో హీరోయిన్ గా అవకాశం రావడం, ఈ చిత్రం తర్వాత ఆమెకు తెలుగులో పలు చిత్రాల్లో నటించే ఛాన్స్ రావడం తెలిసిందే. అయితే కెరీర్లో హిట్లు లేక పోవడంతో అవకాశాలు తగ్గాయి. తర్వాత కొన్ని చిత్రాల్లో ఐటం సాంగులు కూడా చేసింది. తర్వాత వ్యభిచారం కేసులో ఇరుక్కోవడం, ఆ కేసు నుండి బయట పడటం తెలిసిందే.