twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రైడ్' లో శ్వేతా బసు

    By Staff
    |

    Swetha basu prasad
    కొత్త బంగారు లోకం చిత్రంతో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న శ్వేతా బసు రైడ్ అనే టైటిల్ తో తయారుకానున్న మరో చిత్రం కమిట్ అయింది. ఆమెతో పాటు యువత హీరోయిన్ అక్ష కూడా చేస్తోంది. ఇక హీరోలుగా అష్టాచెమ్మ ఫేమ్ నాని,నచ్చావులే ఫేమ్ తనీష్ ఇద్దరూ నటించటానికి రెడీ అవుతున్నారు. ఒక ఊరిలో చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం చేస్తున్నాడు.

    రెండు యువ జంటల మధ్య జరిగే ప్రేమ కథతో ఈ చిత్రం రూపొందొనున్నదని సమాచారం. రమేష్ వర్మ ఈ మధ్య భూమిక హీరోయిన్ గా చేసిన మల్లెపూవు చిత్రంకి కథ అందించారు. సముద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయింది. అయితే ఈ కొత్త ప్రాజెక్టులో అందరూ హిట్టియిన సినిమాల్లోని యూత్ కాబట్టి అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఆ మధ్య రమేష్ వర్మ శ్రీశ్రీ అనే చిత్రాన్ని ప్రకటించారు కూడా. అయితే అది మెటీరియలైజ్ అయినట్లు లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X