Don't Miss!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- News పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు కష్టమే ... ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రంగస్థలం తరువాత సైరానే.. అక్కడే భారీగా!
రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రికార్డులు తిరగరాస్తోంది. రంగస్థలం చిత్రం రాంచరణ్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది. ఈ చిత్రం కోసం హైదరాబాద్ లో భారీ సెట్ వేసి రంగస్థలం గ్రామాన్ని నిర్మించారు. ఆ సెట్ రంగస్థలం చిత్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ సెట్ వర్క్ ని ప్రముఖులంతా అభినందించారు.
తాజగా సమాచారం ప్రకారం రంగస్థలం సెట్ లో మెగాస్టార్ సైరా చిత్రం షూటింగ్ జరుపుకోబోతున్నట్లు తెలుస్తోంది. రంగస్థలం చిత్రం కోసం వేసిన సెట్ లోనే మరో భారీ సెట్ నిర్మించి సైరా తదుపరి షెడ్యూల్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చరిత్ర ఆధారంగా ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతోంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు నటిస్తున్నారు. నయనతార ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రానికి నిర్మాత.