Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
సైరా రికార్డుల హోరు.. కళ్లు చెదిరే ధరకు డిజిటల్ రైట్స్
తొలి దశ స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటీష్ పాలకులను ఎదురించిన తొలి తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సైరా నర్సింహారెడ్డి చిత్రం రిలీజ్కు ముందే రికార్డులు తిరగరాస్తున్నది. ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్మకాలు సంచలనం రేపగా.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ సినీ వర్గాలను నివ్వెరపరిచే విధంగా ఉన్నాయి. డిజిటల్ రైట్స్ బిజినెస్కు సంబంధించిన వివరాలు ఇవే..
నాలుగు భాషల హక్కులను
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నర్సింహారెడ్డి చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందింది. అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ చేజిక్కించుకొన్నది. అన్ని భాషల హక్కుల కోసం రూ.40 కోట్లు చెల్లించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
నిజంగా చెప్పాలంటే 'సైరా నరసింహా రెడ్డి'లో హీరో రామ్చరణ్.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి
తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు కూడా రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. నైజాం హక్కులు రూ.30 కోట్లకు అమ్ముడు కాగా, ఆంధ్ర, సీడెడ్ హక్కుల కోసం రూ.80 కోట్లు అమ్ముడు పోవడం టాలీవుడ్లో ఓ రికార్డుగా చెప్పుకొంటున్నారు.
శరవేగంగా డబ్బింగ్ పనులు
బిజినెస్ విషయాలు ఇలా ఉండగా.. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి రికార్డు స్థాయిలో తక్కువ వ్యవధిలోనే తన డబ్బింగ్ను పూర్తి చేశారు. తాజాగా లక్ష్మీ పాత్రలో కనిపించనున్న తమన్నా భాటియా తన డబ్బింగ్ను పూర్తి చేసుకొన్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశారు.
అక్టోబర్ 2న విడుదల
కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్పై హీరో రాంచరణ్ నిర్మాతగా రూపొందించిన సైరా సినిమా అక్టోబర్ 2న రిలీజ్కు సిద్ధమవుతున్నది. రూ.300 కోట్లతో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. సైరా చిత్రంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు నటించడం సెన్సేషన్గా మారింది. అమితాబ్, నయనతార, తమన్నా, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు లాంటి ఎందరో సినీ ప్రముఖులు సైరా చిత్రంలో భాగస్వామ్యం అయ్యారు. నయనతార చిరంజీవికి భార్యగా నటిస్తుండగా, నృత్యకారిణిగా తమన్నా నటించనున్నది. అవుకు రాజు అనే యుద్ధ వీరుడిగా కిచ్చ సుదీప్, రాజ పాండ్యన్గా విజయ్ సేతుపతి కనిపించబోతున్నారు.