Don't Miss!
- News చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ విచారించిన సుప్రీంకోర్టు
- Sports మ్యాచ్ మధ్యలో స్మోకింగ్..దొరికిపోయిన పాక్ క్రికెటర్ Video
- Technology Ai వీడియో కంటెంట్ ను గుర్తించడానికి Youtube కొత్త టూల్! ఎలా పనిచేస్తుంది?
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
- Automobiles వయసు కేవలం నెంబర్ మాత్రమే!.. ఎందుకో వీడియో చూస్తే తెలుస్తుంది
- Finance Gold Loan: గోల్డ్లోన్స్ తీసుకున్నోళ్లకి హెచ్చరిక..! ఇవి తప్పక తెలుసుకోండి..
- Lifestyle సంపూర్ణ సూర్యగ్రహణం 2024: అమెరికాలోని వందలాది పాఠశాలలకు సెలవు, ఎందుకో తెలుసా?ఆరోజు ఏం జరుగుతుందో తెలుసా
సైరా ప్రీ రిలీజ్.. రికార్డులు తిరగరాస్తున్న మెగాస్టార్ .. రిలీజ్కు ముందే బ్లాక్బస్టర్.. ఎలా అంటే!
టాలీవుడ్లో ఇప్పుడంతా ఎదురుచూపులు సైరా నర్సింహారెడ్డిపైనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు దక్షిణాది నుంచి ఇటు ఉత్తరాది వరకు స్టార్ యాక్టర్లు భాగకావడంతో దేశవ్యాప్తంగా సైరాపై దృష్టిపడింది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మాతగా మారి కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ సినిమా ఇంకా ప్రోస్ట్ ప్రొడక్షన్లో ఉండగానే కలెక్షన్లపరంగా బ్లాక్బస్టర్ అనే టాక్ ప్రచారం అవుతున్నది. సెన్సేషన్గా మారిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..
సీక్రెట్గా రిలీజ్ డేట్..
ఇక సైరా రిలీజ్ డేట్ను కూడా చిత్ర యూనిట్ సీక్రెట్గా పెట్టింది. చిరంజీవి బర్త్ డే రోజున ట్రైలర్తోపాటు రిలీజ్ డేట్ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే రిలీజ్ డేట్ ఏదైనా సినిమా రిలీజ్ అయితే మూడో ఆట కల్లా సైరా లాభాల్లోకి రావడం ఖాయమనే మాట ట్రేడ్ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నది. సినిమా కంటెంట్ ఎలా ఉన్నా.. కలెక్షన్ల పరంగా సైరా బ్లాక్బస్టర్ అని రిలీజ్కు ముందే డిసైడ్ అయ్యారనే తాజా సమాచారం.
రూ.120 కోట్ల మేర బిజినెస్
దసరా పండుగ కానుకగా ముస్తాబుతున్న సైరా నర్సింహారెడ్డి చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగిందనే తాజా సమాచారం. శాటిలైట్, డిజిటల్ హక్కుల అమ్మకాలకే ఈ చిత్రం రూ.120 కోట్లు రాబట్టిందనే ట్రేడ్ వర్గాల రిపోర్ట్. అయితే ఈ ప్రీ రిలీజ్ బిజినెస్కు సంబంధించిన వివరాలను కొణిదెల ప్రొడక్షన్ గోప్యంగా పెట్టినట్టు సమాచారం.
స్టార్ హీరో, హీరోయిన్ల కళకళ
సైరా చిత్రంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు నటించడం సెన్సేషన్గా మారింది. అమితాబ్, నయనతార, తమన్నా, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు లాంటి ఎందరో సినీ ప్రముఖులు సైరా చిత్రంలో భాగస్వామ్యం అయ్యారు. నయనతార చిరంజీవికి భార్యగా నటిస్తుండగా, నృత్యకారిణిగా తమన్నా నటించనున్నది. అవుకు రాజు అనే యుద్ధ వీరుడిగా కిచ్చ సుదీప్, రాజ పాండ్యన్గా విజయ్ సేతుపతి కనిపించబోతున్నారు.
రూ.300 కోట్ల వ్యయంతో సైరా
స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. చిరంజీవి పాత్రకు సంబంధించిన గెటప్ ఇప్పటికే అభిమానులను మెప్పించింది. ఇక నిర్మాత రాంచరణ్ ఈ సినిమాను అక్టోబర్ మొదటి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సుమారు రూ.300 కోట్ల వ్యయంతో తెరకెక్కింది.