twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇది వర్షం కాదు.. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అక్షింతలు.. సైరా వేదికపై ఆకట్టుకున్న రాజమౌళి

    |

    కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) సైరా ప్రీ రిలీజ్ వేడుక అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.

    కిటకిటలాడుతున్న ఎల్‌బీ స్టేడియం

    కిటకిటలాడుతున్న ఎల్‌బీ స్టేడియం

    హైదరాబాద్ లోని ఎల్‌బీ స్టేడియంలో జరుగుతున్న సైరా నరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ వేడుకకు పెద్ద ఎత్తున మెగా అభిమాన వర్గం తరలి వచ్చారు. ఎల్‌బీ స్టేడియం అంతా మెగా అభిమానులతో కిటకిటలాడుతోంది. ఈ వేడుకకు సుమ హోస్ట్‌గా వ్యవహరిస్తూ సైరా విశేషాలు చెబుతోంది.

     వర్షం కారణంగా ఊహించని అంతరాయం

    వర్షం కారణంగా ఊహించని అంతరాయం

    సక్సెస్ ఫుల్‌గా ఈవెంట్ రన్ అవుతుండగా వర్షం రూపంలో అనుకోని అంతరాయం కలిగింది. దీంతో ఈవెంట్ కి వచ్చిన సినీ ప్రముఖులందరినీ వేదికపైకి ఆహ్వానించి త్వరత్వరగా కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

    దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ

    దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ

    అందరికీ నమస్కారం. ఇంత పెద్ద సినిమా, ఇంత చారిత్రాత్మక సినిమా ఈవెంట్ ఇలా జరుగుతుందంటే ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది పరుచూరి బ్రదర్స్‌కి. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథను వాళ్ళు ఎన్నో సంవత్సరాలు వారి గుండెల్లో మోశారు. చివరకు ఈ తెలుగు వీరుడి కథను మీ ముందుకు తెస్తున్నారు అని చెప్పారు రాజమౌళి.

    చరణ్ ఇది నువ్వు మీ నాన్న గారికి మాత్రమే ఇస్తున్న గిఫ్ట్ కాదు

    చరణ్ ఇది నువ్వు మీ నాన్న గారికి మాత్రమే ఇస్తున్న గిఫ్ట్ కాదు

    బ్రిటీష్ వారి మీద మొట్టమొదట పోరాడింది ఓ తెలుగు వీరుడు. ఇది ప్రజలందరికీ తెలియాలని పరుచూరి బ్రదర్స్ కలలు గన్నారు. దాదాపు 20 సంవత్సరాలకు ఆ కలను మా హీరో రామ్ చరణ్ తీరుస్తున్నారు. చరణ్ ఇది నువ్వు మీ నాన్న గారికి మాత్రమే ఇస్తున్న గిఫ్ట్ కాదు.. మొత్తం తెలుగు వారందరికీ ఇస్తున్న గిఫ్ట్. థాంక్యూ.. అన్నారు రాజమౌళి.

    ఎంత కష్టమో నాకు తెలుసు

    ఎంత కష్టమో నాకు తెలుసు

    సైరా నరసింహా రెడ్డి లాంటి సినిమా తీయడం ఎంత కష్టమో నాకు తెలుసు. సినిమాను ప్రజలకు దగ్గర చేసేది ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేస్తూ వీఎఫ్‌ఎక్స్ మిక్స్ చేసి ఇంత అద్భుతంగా తీర్చిదిద్దాలంటే అది మొత్తం అంత డైరెక్టర్ భుజ స్కందాలపై ఉంటుంది. సురేందర్ రెడ్డి గారు కంగ్రాట్స్.. అని రాజమౌళి అన్నారు.

    మగధీర సినిమాకు చిరు సలహాలు

    మగధీర సినిమాకు చిరు సలహాలు

    మగధీర సినిమా చేస్తున్నపుడు చిరంజీవి ఇచ్చిన సలహాలు చూసి ఆశ్చర్యపోయానని రాజమౌళి అన్నారు. మగధీర రిలీజ్ అయ్యాక ఇలాంటి సినిమా తాను ఒక్కటి కూడా చేయలేదని చిరు అన్నారని చెప్పారు. ఆ కోరిక ఇప్పుడు రామ్ చరణ్ తీరుస్తున్నాడు అని అన్నారు రాజమౌళి.

    వర్షం కాదు.. అక్షింతలు

    వర్షం కాదు.. అక్షింతలు

    చాలా మాట్లాడాలనుకున్నాను. కానీ వెనకాల చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఉండగా మాట్లాడటం కష్టం అని అన్నారు జక్కన. ఇక ఇప్పుడు కురిసింది వర్షం కాదని, సైరా యూనిట్ మీద పై నుంచి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వేసిన అక్షింతలు, ఆశీస్సులు అని పేర్కొంటూ తన ప్రసంగాన్ని ముగించారు రాజమౌళి.

    English summary
    Sye Raa pre release event: Megastar Chiranjeevi's Sye Raa Narasimha Reddy pre release event is orgnaised at LB Stadium of Hyderabad. Jana Sena Chief Pawan Kalyan, Koratala Siva, VV Vinayak are the guest for the evening. This movie is releasing on october 2nd.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X